మ‌హిళ‌ల గొప్ప‌త‌నాన్నిపురుషుల‌కుతెలియ‌జేసేలా జ‌వాన్ సినిమా – షారూఖ్ ఖాన్‌

Must Read

జ‌వాన్’ సినిమా మ‌హిళ‌ల గొప్ప‌త‌నాన్నిపురుషుల‌కు తెలియ‌జేసేలా తెర‌కెక్కిన సినిమా – #AskSRKలో షారూఖ్ ఖాన్‌

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’పై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు, ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా సెప్టెంబ‌ర్ 7న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న #AskSRK అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా #AskSRKలో జ‌వాన్ గురించి నెటిజ‌న్స్ షారూఖ్‌ను కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు వేయ‌గానే ఆయ‌న కూడా స‌మాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలేంటో చూద్దాం… 

* ‘జవాన్’లో షారూఖ్ పాత్రను ఓ పదంలో చెప్పండి

– మ‌హిళ‌లు.. ‘జవాన్’ సినిమాను మ‌హిళ‌లే న‌డిపిస్తారు. ఇది మ‌హిళ‌ల గొప్ప‌తనాన్ని పురుషుల‌కు తెలియ‌జేసేలా తెర‌కెక్కిన సినిమా. మాస్, క్లాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. 

* మోష‌న్ పోస్ట‌ర్ మీద ఓ ప‌ద్యం చెప్పండి..

– మీరు అంద‌రూ మోష‌న్ పోస్టర్ మీద ఒక్కొక్క‌రు ఓ ప‌ద్యాన్ని రాసి నాకు పంపండి.. ఎవ‌రూ బాగా రాశారో చూద్దాం. 

*న్యాయానికి గ‌ల 5 ముఖాలేంటి?

– ఈ సినిమాలో అలాంటివి చాలా ముఖాలే ఉంటాయి. రేపు థియేట‌ర్‌లో ఆవేంటో స్క్రీన్ పై చూస్తారు. 

*జ‌వాన్ మూవీలో గుండుతో క‌నిపించ‌డం ….

– జ‌వాన్ సినిమాలో నేను గుండుతో క‌నిపించ‌టం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌ఠాన్ సినిమాలో పొడ‌వాటి జుట్టుతో న‌టించాను. ఆ వెంట‌నే చేసిన జ‌వాన్ మూవీలో గుండు లుక్‌తో న‌టించాను. ఇది నా పిల్ల‌ల‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఎదురు చూస్తున్నాను..హ హ‌

* జ‌వాన్ సినిమాను ఎన్ని సార్లు చూడొచ్చు

– ఓ సారి మ‌న‌సు కోసం, ఓసారి త‌నువు కోసం, ఓ సారి ఫ‌న్ కోసం, నా అభిమాని అయితే నా కోసం ఓసారి.. నాలుగు సార్లు చూడండి

* జ‌వాన్‌ను ఎవ‌రెవ‌రు చూడొచ్చు

– పిల్ల‌ల నుంచి ముస‌లివాళ్ల వ‌ర‌కు అంద‌రూ చూడొచ్చు

* జ‌వాన్‌లో బెస్ట్ షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌

– జ‌వాన్‌లో చాలా లుక్స్‌, చాలా షేడ్స్ చేశాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాం. అయితే సినిమాను ఫైన‌ల్‌గా చూసిన త‌ర్వాత‌ అంద‌రూ ఎంజాయ్ చేశారు. 

*జ‌వాన్ ప్రివ్యూ 2 ఉంటుందా!

– ప్రివ్యూ మ‌ళ్లీ రీ లోడ్ చేయించాలా లేక పాట‌ను రిలీజ్ చేస్తున్నాం.. దాన్ని రిలీజ్ చేయాలా!. మీరంద‌రూ ఆలోచించి చెప్పండి. డైరెక్ట‌ర్ అట్లీతో మాట్లాడి చెబుదాం. ఏదైనా త‌ను చేయాల్సిందే. 

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News