‘నాయకుడు’ ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ

Must Read

తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘నాయకుడు’గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు లో జులై 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ఏఆర్ రెహమాన్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… 

రెహమాన్ గారు… ‘నాయకుడు’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఎవరు మిమ్మల్ని సంప్రదించారు?
తొలుత ఉదయనిధి స్టాలిన్ గారు నన్ను సంప్రదించారు. ‘నాయకుడు’ సినిమాకు సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాకు నచ్చిన కథల్లో ఇదొకటి. కథ విన్నాక… సినిమా చేస్తానని చెప్పాను. 

‘నాయకుడు’ సినిమా మీ నుంచి ఏం డిమాండ్ చేసింది? ఎలాంటి మ్యూజిక్ కోరుకుంది? ప్రయోగాలు ఏమైనా చేశారా?
దర్శకుడు మారి సెల్వరాజ్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పవర్‌ఫుల్‌ గా ఉంటాయి. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు మరింత మాస్ అప్పీల్ ఇచ్చారు. సంగీతం ఎక్కువ మందికి చేరువ అయ్యేలా ఉండాలనుకున్నారు. ప్రయోగాలు, కొత్తగా అంటే… చాలా రోజుల తర్వాత నేను జానపద తరహాలో గీతాలు చేశా. మ్యూజిక్ రాయల్ గా ఉండాలనుకున్నా. 

ఉదయనిధి స్టాలిన్ మీ జానపద గీతాలకు ఎలా డ్యాన్స్ చేశారని అనిపించింది?
షూటింగ్ స్టార్ట్ చేయడానికి నెల ముందు నా దగ్గరకు వచ్చారు. తొలుత ఒక పాట చాలు అన్నారు. నేనూ ఒక పాట ఇచ్చాను. మిగతా పాటలకు షూటింగ్ చేశాక… బాణీలు అందించాను. ప్రతి పాటకు ఒక అర్థం ఉంటుంది. 

మీరు ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. ‘జివ్వు జివ్వు…’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు!
(నవ్వుతు…)  ఆ పాటకు ఫన్ టచ్ ఇవ్వాలని అనుకున్నా. సాంగ్ సిట్యువేషన్ మెచ్యూర్ గా ఉంటుంది. మాస్ అండ్ ఫన్ టచ్ కోసం అలా చేశా. 

ఇటీవల మీరు ‘పొన్నియన్ సెల్వన్’ కు సంగీతం అందించారు. అదొక చారిత్రక కథ. సంగీత దర్శకుడిగా సవాల్ విసిరే సినిమా అది. ‘నాయకుడు’ తరహా కమర్షియల్ కథలకు సంగీతం అందించేటప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి?
రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సమాజంలోని అసమానతలు, ఇంకా ఎన్నో విషయాల గురించి చర్చించారు. చాలా అంశాలపై మాట్లాడారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం ఓ కొత్త అనుభూతి. 

సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ, మెలోడీ & లిరిక్ ఎప్పుడూ సేమ్. గత 35, 40 ఏళ్లుగా సేమ్ ఉంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే… సాంగ్ సింపుల్, క్యాచీగా ఉండాలి. బీట్ చేంజ్ అవుతుంది. మిక్సింగ్ చేంజ్ అవుతుంది. నా కోర్ కాన్సెప్ట్, మ్యూజిక్ కంపొజిషన్, థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ప్రేక్షకుల్లో, సమాజంలో మార్పులు వచ్చాయి. సంగీతంపై ఆ ప్రభావం ఉంటుంది.

ఆస్కార్ అవార్డుకు ముందు, తర్వాత అని రెహమాన్ లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగితే ఏం చెబుతారు?
నేను సేమ్ అండి. నాలో మార్పు ఏమీ రాలేదు. అయితే… ప్రపంచంలో మనకు ఇచ్చే గౌరవం పెరిగింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ మందికి తెలిసింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News