హాట్ స్టార్ స్పెషల్స్ దయా వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్

Must Read

ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను తెలుగు వారికి అందిస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తీసుకొస్తున్న మరో యూనిక్ వెబ్ సిరీస్ దయా. పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి, రమ్య నంబీశన్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు. దయా వెబ్ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను దర్శకుడు కృష్ణవంశీ విడుదల చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ – దయా వెబ్ సిరీస్ ట్రైలర్ బాగుంది. ఈ సిరీస్ లోని బ్యాక్ గ్రౌండ్స్, ఎడిటింగ్ ప్యాట్రన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. పవన్ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. చక్రికి చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ క్యారెక్టర్ దొరికింది. ఈషా, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. అన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ – చక్రవర్తి నా క్లోజ్ ఫ్రెండ్. మేము కలిసి హీరోయిన్స్ పోస్టర్స్ చూసేందుకు నగరంలో తిరిగేవాళ్లం. అప్పుడు రంభ మా ఫేవరేట్ హీరోయిన్. ఆమెతో ఆ తర్వాత బొంబాయి ప్రియుడు అనే సినిమా చేశాడు చక్రి. అతనికి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. చక్రవర్తి తెలుగు సినిమా అమీర్ ఖాన్. సినిమాలోని అన్ని క్రాఫ్టులపై అతనికి పట్టు ఉంది. దయా సిరీస్ ఎంత బాగుంటే తను ఒప్పుకుని ఉంటాడనేది నేను ఊహించగలను. ఇలాగే హీరోగా నటిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు

జోష్ రవి మాట్లాడుతూ – ఈ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ బాగుంటాయి. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన పవన్ గారికి థాంక్స్. జేడీ చక్రవర్తి నాకు ఇష్టమైన హీరో. ఆయన సినిమాలు చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు జేడీ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ – డైరెక్టర్ పవన్ నాకు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా కథ చెప్పారు. నేను ఈ సినిమాలో నటించడం ఎందుకో కుదరలేదు. అయినా మేము కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకునేవాళ్లం. ఈ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటిదాకా నేను ఇలాంటి నటించలేదు. చాలా సెటిల్డ్ పర్మార్మెన్స్ ఉంటుంది. పవన్ నాతో అలా వర్క్ చేయించారు. దయా మీకు తప్పకుండా నచ్చుతుంది. అని చెప్పింది.

విష్ణు ప్రియ మాట్లాడుతూ – నేను టీవీ షోస్ లో ఎంటర్ టైనర్ ని మాత్రమే అని మీకు తెలుసు. కానీ ఈ వెబ్ సిరీస్ లో ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చి నాలోని నటిని చూపించే అవకాశం ఇచ్చారు దర్శకుడు పవన్. నాకు ఇష్టమైన కాస్ట్ తో కలిసి నటించే ‌అవకాశం కూడా ఈ వెబ్ సిరీస్ ద్వారా నాకు దక్కింది. అని చెప్పింది.

నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ – హాట్ స్టార్ లాంటి ఓటీటీలు ఉన్న కాలంలో మేము నటులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి అవకాశాలు మాకు దక్కుతున్నాయి. దయా వెబ్ సిరీస్ లో నటిస్తున్నప్పుడు ఒక సినిమా చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంత మంచి కంటెంట్ ఇందులో ఉంది. అని చెప్పారు.

ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నుంచి అభిషేక్ దాదా మాట్లాడుతూ – మేము తెలుగులో చేస్తున్న తొలి సిరీస్ ఇది. మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చిన డైరెక్టర్ పవన్, హీరో జేడీ చక్రవర్తి ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మీకు నచ్చే వెబ్ సిరీస్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ – గులాబీ సినిమాతో నన్ను హీరోగా చేసిన కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి రావాలని నా కోరిక. అలాగే వచ్చాడు. నేను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. పవన్ ను కలిసినప్పుడు డైరెక్టర్ గా అతనిలో ఒక ప్రామిసింగ్ క్వాలిటీ కనిపించింది. ఫొటో షూట్ దగ్గర నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను షూటింగ్ చేశాడు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్బ్ గా ఉంటుంది. కమల్, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ సర్ ప్రైజ్ చేస్తాయి. జోష్ రవికి మంచి క్యారెక్టర్ ఉంది. వెబ్ సిరీస్ బాగుంటుంది చూడండి అని మేము పదే పదే చెప్పనక్కర్లేదు. మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా చూస్తారు. అని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News