రంగబలి గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్

Must Read

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ తో వస్తున్నారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకునే సుమగారు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఉండటం ఆనందంగా వుంది. సుధాకర్ గారు, నేను ఎప్పటి నుంచో కలసి సినిమా చేయాలని అనుకున్నాం. పవన్ చెప్పిన కథ మా ఇద్దరికీ నచ్చింది. చేస్తే ఇలాంటి కథ చేయాలనిపించింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. నాకు ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టరే కావాలి. చాలా మంచి సినిమాని ప్రేక్షకులకు, అభిమానులకు ఇవ్వబోతున్నాననే నమ్మకం వుంది. ఇప్పటివరకూ సుధాకర్ గారికి వచ్చిన లాభాలు కంటే ఈ సినిమాకి వచ్చిన లాభాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నాను.  యుక్తి చక్కగా నటించింది. సత్య మంచి టైమింగ్ వున్న నటుడు. ఇందులో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. వంశీ, దివాకర్ మణి మంచి విజువల్స్ ఇచ్చారు. పవన్ చాలా మంచి ఆల్బం ఇచ్చారు. పాటలకు వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు పవన్ చాలా భాద్యత  గా, నిజాయితీగా సినిమా తీశారు. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూలై 7న థియేటర్ లో కలుద్దాం” అన్నారు.

సుమ మాట్లాడుతూ.. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా మాట్లాడటం ఆనందంగా వుంది. ఇలాంటి కమర్షియల్ సబ్జెక్ట్, ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. శౌర్య మొదటి సినిమా నుంచి ఎంతో కష్టపడుతున్నారు. సుధాకర్ గారు సినిమా అంటే ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్. పవన్ గారికి అభినందనలు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. జులై 7 థియేటర్ థియేటర్ లో కలుద్దాం” అన్నారు.

దర్శకుడు పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ.. ఈ వేదికపై ఉండటానికి కారణం శౌర్య అన్న, సుధాకర్ గారు. ఈ సినిమాలో శౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. నిర్మాత ఎక్కడ రాజీపడకుండా తీశారు. వంశీ, దివాకర్ మణి గారు బ్రిలియంట్ వర్క్ చేశారు. యుక్తి చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో నటించిన అందరికీ థాంక్స్. పవన్ సిహెచ్  మంచి పాటలు ఇచ్చారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ట్యాలెంటెడ్ టీంతో పని చేశాం. చాలా మంది కొత్త దర్శకులు పరిశ్రమలోకి వస్తున్నారు. వారికి కూడా ఇలాంటి మంచి హీరో, నిర్మాత దొరకాలని కోరుకుంటున్నాను. అంతా ఈ సినిమా మొదటి రోజు చూడండి. కొత్త దర్శకుల సినిమాని నేను కూడా ఫస్ట్ డే చూస్తాను. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

యుక్తి తరేజ మాట్లాడుతూ..దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. శౌర్య గారి  తో  కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ టీంతో కలిసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. జులై 7న అందరూ సినిమాని థియేటర్ లో చూడండి” అన్నారు

కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా మన వూరిని గుర్తు తెచ్చి ఆకట్టుకునే సినిమాలా అనిపిస్తుంది. సొంత ఊరు చాలా ప్రత్యేకం. నిజానికి నా పేరు కిషోర్. తిరుమల అనేది మా ఊరు పేరు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. శౌర్య, సుధాకర్ గారికి ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ కి అభినందనలు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి” అన్నారు. ఈ వేడుకలో రాజ్ కుమార్ కేసిరెడ్డి, నోయల్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News