ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
ఈ రోజు త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి యాక్ట్రెస్ కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్ చేశారు. కుషిత కల్లపు క్యారెక్టర్ బోల్డ్, ఫియర్స్, గ్లామరస్ గా ఉండి ఆకట్టుకుంటోంది. త్రీ రోజెస్ సీజన్ 2 కు ఆమె క్యారెక్టర్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతోంది. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఈ సిరీస్ లో కుషితకు కీలకమైన క్యారెక్టర్ ఇచ్చారు. కుషితకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. త్రీ రోజెస్ సీజన్ 2 లో ఆమె క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటూ, యూత్ ను బాగా ఆకట్టుకునేలా వైరల్ కంటెంట్ తో ఉండనుంది. ఇప్పటికే త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి రిలీజ్ చేసిన హీరోయిన్ ఈషా రెబ్బా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే త్రీ రోజెస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్ను ఎస్ కే…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…