“గరుడ చాప్టర్-1” ఫస్ట్ లుక్ విడుదల

Must Read

సత్య దేవ్, క్రాంతి బాల, అభిషేక్ నామా, శ్రీ అభిషేక్ పిక్చర్స్ “గరుడ చాప్టర్-1” ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ హీరో సత్య దేవ్ విభిన్నమైన జోనర్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్‌ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు  క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఇది డెవిల్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్.

ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా  కొత్త సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గరుడ చాప్టర్-1” అనే స్ట్రయికింగ్ టైటిల్‌ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని కూడా విడుదల చేశారు మేకర్స్.

సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని మోస్తూ అడవిలో నిలబడి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో గొడ్డలితో కనిపించారు. అతని వెనుక ఒక కుక్క నిలబడి ఉంది. చెట్లకు నిప్పంటండం కనిపిస్తోంది. పోస్టర్‌ లో సత్యదేవ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ గెటప్ చాలా కొత్తగా వుంది. లుంగీ ధరించి కనిపించారు సత్యదేవ్. క్రాంతి బాల సత్య దేవ్‌ ను మునుపెన్నడూ చూడని అవతార్, యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్, పవర్ ఫుల్  స్క్రిప్ట్‌ ను రాశారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గరుడ సత్యదేవ్‌ కు అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందించిన చిత్రం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు

సౌందర్ రాజన్ ఎస్ కెమరామెన్ పని చేస్తుండగా, టాలెంటెడ్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్. మోహిత్ రౌలియాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్,  పోతిని వాసు సీఈఓ.

తారాగణం: సత్య దేవ్

సాంకేతిక విభాగం:
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: శ్రీ అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకుడు: క్రాంతి బాల
సీఈఓ: పోతిని వాసు
డివోపీ: సౌందర్ రాజన్.ఎస్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహిత్ రౌలియాని
పీఆర్వో: వంశీ శేఖర్
పోస్టర్లు: కన్ని స్టూడియో

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News