GAMA అవార్డ్స్ 2025 – 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్

Must Read

ఫిబ్రవరి 16, 2025న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, GAMA ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు.

మొట్టమొదటి సరిగా, సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించబడింది.

ప్రత్యేక హైలైట్స్
⁠ఈ వేడుకలో GAMA Organizing commitee మరియు ప్రముఖ గాయకుడు శ్రీ రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ Date & Venue మరియు జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నారు.
జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు – శ్రీ ఏ. కొదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు – శ్రీ కోటి , మరియు ప్రముఖ సినీ దర్శకులు – శ్రీ బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ బహుకరించబడతాయి.

⁠ఈ ప్రత్యేకమైన వినూతన రీతిలో సృజనాత్మకమైన  ప్రెజెంటేషన్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ అందరికీ అద్భుత అనుభూతిని కలిగించేలా అనౌన్స్‌మెంట్‌ను చేసారు.
⁠GAMA AWARDS చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త  "శ్రీ కేసరి త్రిమూర్తులు గారు" మాట్లాడుతూ, గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్న GAMA, ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్ కు ప్రముఖ సినీ పెద్దలను,కళాకారులను విశిష్ట అతిధులుగా  ఆహ్వానించ దలిచారని UAE లోని  తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు మరియు  UAE ఈ  కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతితెలుగు వారికి ధన్యవాదములు తెలియజేసారు. 

⁠GAMA AWARDS CEO "సౌరభ్ కేసరి" మాట్లాడుతూ GAMA అవార్ద్స్ కు వినూత్నంగా అత్యంత వినోదభరితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. వివిధ రానగలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి THE GAMA EXCELLENCE AWARDS ఇచ్చి సత్కరించనున్నారని తెలియజేసారు.  ఇప్పటికే సినీ ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందని తెలియజేసారు.  నామినేటెడ్ అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటిండింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తామని తెలియజేసారు.      

ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించేందుకు GAMA అవార్డ్స్ ఎంత ముఖ్యమైన వేదికగా నిలుస్తుందో వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారందరు GAMA అవార్ద్స్ 2025, విజవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారందరు ఇంత అద్బుతమైన ఇటువంటి కార్యక్రమం UAE లో జరగడం తెలుగు వారందకీ చాలా గర్వముగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ప్రముఖుల సందేశాలు :
ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న శ్రీ ఏ. కొదండ రామిరెడ్డి (దర్శకుడు), శ్రీ కోటి (సంగీత దర్శకుడు), శ్రీ బి. గోపాల్ (దర్శకుడు) ప్రత్యేకంగా పంపిన వీడియో సందేశాలు పంపించారు. వీరి సందేశంలో.. ప్రతి ఒక్కరూ GAMA గొప్పతనాన్ని, కళాకారుల ప్రతిభకు అందించే ప్రోత్సాహాన్ని గురించి వెల్లడించారు.

కుంచె రఘు గారు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ GAMA ఈవెంట్ అని అన్నారు. GAMA తో మాకు చాలా మంచి అనుబంధం ఉందని అన్నారు. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పారు.

వినోదాన్ని పంచిన సంగీత వేదిక :
ఈ వేడుకలో యాంకర్ & సింగర్ తిరు మరియు శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడంతో, హాజరైన ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్‌ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. MAGICIAN RAVI వారి వినూత్న మాయాజాలంతో GAMA అవార్ద్స్ 2025, REVEAL చెయ్యడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అంతా ఎదురుచూస్తున్న భారీ ఈవెంట్!
GAMA అవార్డ్స్ 2025 మెయిన్ ఈవెంట్ జూన్ 7, 2025న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత, కళా రంగ ప్రముఖులు, ప్రతిభావంతులు, సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ ఈ గామా అవార్డ్స్ 2025 లో పాల్గొననున్నారు.
అవార్డ్స్, సంగీత ప్రదర్శనలు, అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలతో GAMA 2025 తెలుగు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది!

మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి… ఆసక్తిగా ఎదురుచూడండి!

GAMA 2025 – సంగీత, కళా ప్రపంచానికి గౌరవ వేదిక!

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News