‘యుఫోరియా’ చిత్రాన్ని ప్రేక్ష‌కులంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఆహ్లాదక‌రంగా చ‌క్క‌టి మెసేజ్‌తో తెర‌కెక్కించాం: ‘రామ రామ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌

వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ రూపొందిస్తోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘యుఫోరియా’. సమకాలీన అంశాలతో , లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లింప్స్‌, ఫ్లై హై సాంగ్‌తో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. శ‌నివారం రోజున ఈ మూవీ నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భూమిక‌, విఘ్నేష్ గ‌విరెడ్డి, రోహిత్‌, డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, నీలిమ గుణ, ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధ‌వ్‌, మాస్ట‌ర్‌ ఆరుష్‌, యానీ మాస్ట‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ‘‘నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ‘యుఫోరియా’ సినిమాను తీశారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తెర‌కెక్కించాం. అంద‌రూ క‌నెక్ట్ అయ్యేలా ఆహ్లాదక‌రంగా చ‌క్క‌టి మెసేజ్‌తో సినిమాను తెర‌కెక్కించాం. ఫ్లై హై అనే పాట‌తో అంద‌రినీ మెప్పించిన కాల భైర‌వ ఇప్పుడు రామ రామ అనే సాంగ్‌తో మ‌న ముందుకు వ‌చ్చారు. చైత‌న్య ప్ర‌సాద్ ఈ పాట‌కు మంచి సాహిత్యాన్ని అందించారు. అంద‌రూ ఎంజాయ్ చేసేలా పాట ఉంటుంది. ప్ర‌వీణ్ పూడి వంటి టెక్నీషియ‌న్‌తో వ‌ర్క్ చేయ‌టం హ్య‌పీ. ప్ర‌వీణ్ కె.పోత‌న్ అనే సినిమాటోగ్రాఫ‌ర్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నాను. ఇందులో దాదాపు 20 మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేశాను. ఇందులో విఘ్నేష్ గ‌విరెడ్డి క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. త‌ను మ‌న‌సు పెట్టి న‌టించాడు. అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. రోహిత్‌గారు ఈ సినిమాలో చాలా చ‌క్క‌గా న‌టించారు. చాలా రోజుల‌ త‌ర్వాత భూమిక మా సినిమా ద్వారా…చాలా మంచి పాత్ర‌లో రీ ఎంట్రీ ఇచ్చారు’’ అన్నారు.

న‌టి భూమిక మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. నాకు ప‌ద‌కొండేళ్ల కొడుకున్నాడు. విఘ్నేష్‌తో ఎక్కువ‌గా సెట్స్ లో ఉన్న‌ప్పుడు మా అబ్బాయితో ఉన్న‌ట్లే అనిపించింది. త‌ను ఎంతో గొప్ప‌గా న‌టించాడు. ఆ మూవీ నుంచి విడుద‌లైన రామ రామ సాంగ్ ఎంతో న‌చ్చింది. కాల భైర‌వ మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మ‌న‌పై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. తల్లిదండ్రులు త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా’’ అన్నారు.
ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ నుంచి ‘రామ రామ‌’ సాంగ్ రిలీజ్ కావ‌టం చాలా ఆనందంగా ఉంది. గుణ శేఖ‌ర్‌గారు తెర‌కెక్కించిన చూడాల‌ని ఉంది సినిమాకు నేను అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అప్పుడు ఆయ‌న్ని ఎలాగైతే చూశానో, ఇప్ప‌టికీ అలాగే ఉన్నారు. త‌న సినిమాల ద్వారా సోసైటీకి ఏదైనా చెప్పాల‌ని అనుకుంటారు. అలాంటి వ్య‌క్తులు ఈ సోసైటీకి ఎంతో అవ‌స‌రం. చాలా గ్యాప్ త‌ర్వాత భూమిక‌గారు తెలుగులో న‌టించారు. యుఫోరియా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులను ఆవిష్క‌రిస్తుంది. అంద‌రూ చూడాల్సిన సినిమా ఇది. త‌ల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. చాలా మంది కొత్త వాళ్ల‌ను ఈ సినిమా ద్వారా గుణ‌శేఖ‌ర్‌గారు ప‌రిచ‌యం చేస్తున్నారు. అంద‌రూ ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ నుంచి రిలీజైన రామ రామ సాంగ్ చూస్తుంటే నాకు ఒక్క‌డు సినిమాలో చెప్ప‌వే చిరుగాలి సాంగ్‌లో ఆమెను చూసిన‌ట్లే అనిపించింది. ఆమె ఈ సినిమాలో న‌టించ‌టం ఎంతో గొప్ప‌గా భావిస్తున్నాం. ఈ సినిమాతో ఆమె క్యూట్ మామ్‌గా పేరు తెచ్చుకుంటారు. కాల భైర‌వ‌గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

యాక్ట‌ర్ విఘ్నేష్ మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ అందరూ చూడాల్సిన సినిమా. ప్రేక్ష‌కుల స‌మ‌యానికి, డ‌బ్బుకి విలువిచ్చి చేసిన సినిమా. భూమిక‌గారు నాకెంతో కంఫర్ట్ ఇచ్చారు. ఆమెకు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. ఇందులో నేను ఆమె కొడుకు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. నాతో పాటు కొత్త ఆర్టిస్టుల‌ను, టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేసినందుకు గుణ‌శేఖ‌ర్‌గారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. నిజాయ‌తీగా చేసిన సినిమా ఇది. అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

రోహిత్ మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ సినిమా మ‌న అంద‌రి కోసం చేసిన సినిమా. గుణ‌శేఖ‌ర్‌గారు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేశారు. మంచి ఆలోచ‌న‌ను క‌లిగించే సినిమా అవుతుంది. విఘ్నేష్ డెబ్యూ సినిమా అయిన‌ప్ప‌టికీ చ‌క్క‌గా న‌టించాడు. భూమిక‌గారితో క‌లిసి ప‌నిచేయటం మెమ‌ర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. గుణ‌శేఖ‌ర్‌గారు ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌గా సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో సినిమా చేయ‌టాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అన్నారు.

విఘ్నేష్ గవిరెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుండగా.. ప్రముఖ నటి భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగిణి గుణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago