‘సయరా’లో ప్రత్యేకంగా నిలిచే నాలుగో సింగిల్‌ ‘హమ్‌సఫర్’ పాట గొప్పదనాన్ని వివరించిన దర్శకుడు మోహిత్ సూరి

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ‘సయారా’ చిత్రం రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ‘సయారా’ ఆల్బమ్‌లోని నాల్గవ పాట హమ్‌సఫర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఇప్పటివరకు ఈ చిత్రంలోని మూడు పాటలు విడుదల చేయగా అవన్నీ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. సయారా టైటిల్ ట్రాక్, జుబిన్ నౌటియాల్ పాడిన బర్బాద్ సాంగ్, విశాల్ మిశ్రా ఆలపించిన తుమ్ హో తో పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు సంగీత ద్వయం సచెట్-పరంపర పాడిన మరో రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. మోహిత్ సూరి మొదటి సారిగా ఈ సంగీత ద్వయంతో కలిసి పని చేశారు. దీంతో ఈ పాట మీద సహజంగానే అంచనాలు పెరిగాయి.

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఎలా ప్రేరేపించుకుని సంగీతం ఎలా తయారు చేసుకోవచ్చో చూడటానికి సాచెట్, పరంపర నిదర్శనంగా ఉంటారు. ఈ జంట పాడిన పాటతో అహాన్, అనీత్ కెమిస్ట్రీ కూడా మరింతగా ప్రొజెక్ట్ అయింది. సాచెట్, పరంపర మ్యూజిక్‌ను నిశితంగా పరిశీలించడానికి అహాన్, అనీత్ చాలా సమయం గడిపారు.

సృజనాత్మక మనసులు ఎలా సహకరిస్తాయో, విభేదిస్తాయో, కలిసి అందమైన సంగీతాన్ని ఎలా సృష్టిస్తాయో నేర్చుకున్నారు. కాబట్టి ఈ చిత్రంలో అహాన్, అనీత్ గురించి మీరు చూసేది చాలా వరకు అది సాచెట్, పరంపర రిఫరెన్స్‌లానే ఉంటాయి. ‘హమ్‌సఫర్’ మా ఆల్బమ్‌లో చాలా ప్రత్యేకమైన పాట. సరైన సహచరుడు ఎదురైనప్పుడు జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పే సందర్భంలో ఈ పాట వస్తుంది. హమ్‌సఫర్ అనేది మీరు మీ జీవితంలోని ప్రేమతో ఉన్నప్పుడు మీరు పొందే చాలా సంతృప్తికరమైన అనుభూతి గురించి చెబుతుంది. అక్కడ సమస్యలు ఉండవు.. ఒకరితో ఒకరు పూర్తిగా ఉన్నట్లు భావిస్తారు.

“సాచెట్, పరంపర ఇండియాలో టాప్ మోస్ట్ సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లుగా దూసుకుపోతోన్నారు. వారిని మా మ్యూజిక్ ఆల్బమ్ సయారాలో చేర్చడం, వారి స్వరం, సంగీతం ద్వారా ప్రేమకు సరికొత్త కోణాన్ని జోడించడం ఆనందంగా ఉంది. ఈ పాటను ప్రజలకు అందించడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు ఈ పాటను ఇష్టపడతారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన సయారా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఓ ఎమోషనల్, లవ్, న్యూ ఏజ్ డ్రామాను చూడబోతోన్నారని హింట్ ఇచ్చారు. సైయారా అనే టైటిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీని అర్థం సంచరించే ఖగోళ శరీరం లేదా సంచరించే నక్షత్రం. ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది, ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంది, కానీ ఎప్పుడూ అందనంత దూరంలో ఉంటుంది.

ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే హీరోగా పరిచయం అవుతున్నాడు. CEO అక్షయ్ విధాని ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

YRF 50 ఏళ్ల చరిత్రలో ఎన్నో కల్ట్ రొమాంటిక్ చిత్రాలను అందించింది. ప్రధానంగా యష్ చోప్రా, ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఎన్నో క్లాసిక్ హిట్లు వచ్చాయి. మోహిత్ సూరి దర్శకత్వంలో ఇది వరకు ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి రొమాంటిక్ చిత్రాల్ని కూడా YRF అందించింది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

19 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago