సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా న్యూ వెబ్ సిరీస్ “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్”

Must Read

సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా న్యూ వెబ్ సిరీస్ “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్”ని లాంచ్ చేసిన ETV విన్

ETV విన్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్” అనౌన్స్‌మెంట్ తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వెబ్ సిరిస్ ప్లాట్‌ఫారమ్‌లో పెరుగుతున్న ఆడియన్స్ ను ఆకట్టుకునేలా క్యాలిటీ కంటెంట్ కి ఇది ప్రామిస్ చేస్తోంది. సందీప్ రాజ్ షో రన్నర్ గా వున్న ఈ సిరిస్ కి జోసెఫ్ క్లింటన్ రైటర్, డైరెక్టర్. 

పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ లాంచింగ్ ఈవెంట్ సిరీస్‌కు నాంది పలికింది. పరిశ్రమ నుంచి ప్రముఖులతో పాటు టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నిర్మాత ఎఎస్కేఎన్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఈ పోస్టర్ సిరీస్ కి ఒక ఇంట్రస్టింగ్ టోన్ ని సెట్ చేస్తుంది. “AIR: All India Rankers” ఫ్యాన్, డ్రామా అండ్ ఇంటెన్సిటీ వున్న సిరిస్ ని హింట్ ఇస్తోంది. 

“AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్” ఒక థ్రిల్లింగ్ వెంచర్‌గా రూపొందుతోంది, ఇది ప్రేక్షకులపై గుర్తిండిపోయే సిరిస్ కానుంది. స్ట్రాంగ్ క్రియేటివ్ టీం, ప్రముఖ నటీనటులుతో ఈ వెబ్ సిరిస్ ETV విన్ లైనప్‌కు ఒక ఒక ముఖ్యమైన ఎడిషన్. ఈ వెబ్ సిరిస్ ఎమోషన్, డ్రామా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. 

నటీనటులు: హర్ష రోషన్, భాను ప్రతాప, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: జోసెఫ్ క్లింటన్

ప్రెజెంటర్, షో రన్నర్: సందీప్ రాజ్

ప్రొడ్యూస్ బై పాకెట్ మనీ పిక్చర్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News