ఎర్రచీర సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్. డిసెంబర్ 20న మూవీ విడుదల

Must Read

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – ది బిగినింగ్” తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈరోజు సినిమా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. హారర్, దేవుడు కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఈ సినిమా కూడా ఆ ట్రెండ్ లోనే వస్తుందని అనుకోవచ్చు. అయితే ఇంకా డిఫరెంట్ గా ఈ మూవీని రూపొందించారు. బేబి సాయి తేజస్విని ముఖ్యపాత్రలో నటించింది. ఇండస్ట్రీకి కొత్త వాళ్లు రావాలి. అప్పుడే కొత్త టాలెంట్ మనకు దొరుకుతుంది. ఎర్రచీర సినిమా విజయం సాధించి ఈ టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ ను ఈ రోజు కార్తీకమాసం పర్వదినం సందర్భంగా ఈ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమాను రూపొందించాను. సినిమాలోని 22 పాత్రలతో పాటు ఎర్రచీర కూడా 23వ పాత్ర పోషిస్తుంది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బేబి సాయితేజస్విని నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ కథలో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. డిసెంబర్ 20వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను విడుదల చేయబోతున్నాం. మరిన్ని ప్రెస్ మీట్స్ లో ఇంకా డీటెయిల్డ్ గా మూవీ హైలైట్స్ తెలియజేస్తాను. అన్నారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” గ్లింప్స్ లో హర హర మహాదేవా అని వచ్చినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ గ్లింప్స్ మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాం. మా టీమ్ క్వాలిటీ మూవీ చేసేందుకు ఎంత కష్టపడ్డారో మీకు ఈ గ్లింప్స్ లోనే తెలుస్తుంది. బేబి సాయి తేజస్విని చక్కగా నటించింది. మూవీలో ఆమెకు నాకు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈరోజు ట్రెండ్ ప్రకారం ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ ఉన్న చిత్రమిది. మదర్ సెంటిమెంట్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సుమన్ బాబు, అతని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ పులిగార్ల మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన సుమన్ బాబు గారికి థ్యాంక్స్. ఆయన నాకు గత పదేళ్లుగా తెలుసు. నేను చక్రి గారి దగ్గర వర్క్ చేశాను. నా ప్రతి సినిమా మొదటి సినిమాలాగే పనిచేయడం నేర్చుకున్నా. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు డిఫరెంట్ గా పాటలు చేసే అవకాశం దొరికింది. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న మా సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరించండి. అన్నారు.

నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. అయితే అది ఏంటి అనేది ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో తీసిన చిత్రమిది. సుమన్ బాబుకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

పీఆర్ఓ, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -“ఎర్రచీర – ది బిగినింగ్” గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అంబికా కృష్ణ గారికి, భరద్వాజ అన్న గారికి థ్యాంక్స్. ఈ సినిమా కథను సుమన్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని అనిపించింది. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ప్రేక్షకులకు ఏం కావాలో సుమన్ బాబుకు తెలుసు. ఆ ఎలిమెంట్స్ అన్నీ కలిపి “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా రూపొందించారు. గ్రాఫిక్స్ బేస్డ్ మూవీస్ రిలీజ్ కొంత ఆలస్యమైనా ఘన విజయాలు సాధిస్తుంటాయి. మన గతంలోనూ ఇలాంటి మూవీస్ బ్లాక్ బస్టర్ కావడం చూశాం. సినిమా ఎంత బాగుంటుందో గ్లింప్స్ లో కనిపిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News