నటుడు డా. హరనాథ్ పోలిచెర్ల కు లోకనాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం

Must Read

చలనచిత్ర నటుడు, నిర్మాత డా. హరనాథ్ పోలిచెర్లకు అరుదైన గౌర‌వం ల‌భించింది. లోకనాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయ‌న‌కు ప్రదానం చేశారు. విశాఖపట్నంలో జ‌రిగిన‌ ఎన్టీఆర్ 29వ వర్థంతి, ఎఎన్ఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని డా. హరనాథ్ పోలిచెర్లకు అందించి స‌త్క‌రించారు.

ఈ వేడుకలో ముఖ్య అతిథిగా త్రిపుర గ‌వర్న‌ర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్ర‌ముఖ సినీ న‌టులు బ్ర‌హ్మ‌నందం, ద‌ర్శక‌నిర్మాత‌లు అశ్వనీద‌త్‌, వైవీఎస్ చౌద‌రి, సాహితీవెత్త అందెశ్రీ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అతిథులు డా. హరనాథ్ పోలిచెర్ల ను జీవన సాఫల్య పురస్కారం తో సత్కరించి అభినందించారు. ఆయ‌న వైద్య రంగంలో, సినీ రంగంలో చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు గౌర‌వ స‌త్కారం అందించిన‌ లోకనాయక్ ఫౌండేషన్ నిర్వ‌హ‌కుల‌కు, అతిథుల‌కు డా. హరనాథ్ పోలిచెర్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సినీ రంగంలో త‌న‌దైన ప్ర‌తిభ చూపిస్తున్న డా. హరనాథ్ పోలిచెర్ల ప్రముఖ నిర్మాత రామానాయుడు కీలక పాత్రలో నటించిన ‘హోఫ్’ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘చంద్రహాస్‌’ను నిర్మించారు. తన సినీ ప్రస్థానంలో ‘అలెక్స్’, ‘చాప్టర్ 6’, ‘బీఎఫ్ఎఫ్’, ‘కెప్టెన్ రానా ప్రతాప్’, ‘డ్రిల్’ వంటి చిత్రాలలో హీరోగా నటించి, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం డా.హరనాథ్ పోలిచెర్ల ‘నా తెలుగోడు’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం గ్లిట్ట‌ర్స్ ఫిల్మ్ అకాడెమీ కాస్టింగ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తోంది.

డా. హరనాథ్ పోలిచెర్ల లోకనాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ రంగం నుంచి ప‌లువురు అభినంద‌నలు, శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News