డైలాగ్ కింగ్ సాయి కుమార్ బర్త్ డే స్పెషల్

నటుడు సాయికుమార్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఆయన్ను తలచుకోగానే ముందు గుర్తుకు వచ్చేది ఆ గంభీర‌మైన గాత్రం, ఆక‌ట్టుకునే వాచకం. ఆయన గళం ఎంతో మందిని హీరోలగా నిలబెట్టింది. ఆ గళమే ఆయనకు తిరుగులేని హీరోగా, నటుడిగా కెరీర్‌ను ఇచ్చింది. ‘డైలాగ్ కింగ్’గా సాయి కుమార్ దక్షిణాది చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. కుటుంబం సినీ రంగంతో అనుబంధం కలిగి ఉంది. నటుడు పి.జె.శర్మ తనయుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే సాయి కుమార్ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చకున్నారు. 1961 జూలై 27న జన్మించిన సాయికుమార్ రీసెంట్‌గానే సినీ పరిశ్రమలో యాభై ఏళ్ల సుధీర్ఘమైన మైలురాయిని చేరుకున్నారు. సాయి కుమార్ ఇలానే మరెన్నో గొప్ప పాత్రలతో మెప్పిస్తూ, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని కోరుకుందాం.

కెరీర్ ప్రారంభంలోనే సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో హీరోల‌కు, ఇత‌ర పాత్ర‌ల‌కు సైతం తన స్వరాన్ని అందించారు. ఆయన డబ్బింగ్‌ చెప్పిన తొలిచిత్రం ‘సంసారం’. కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా మెప్పించారు. బాలనటుడిగా సాయికుమార్‌ చేసిన తొలి సినిమా ‘దేవుడు చేసిన పెళ్లి’. అయితే సాయి కుమార్‌కి కన్నడలో ముందుగా క్రేజ్ లభించింది. ‘పోలీస్ స్టోరీ’ కన్నడలో భారీ విజయం సాధించిన తర్వాత తెలుగులోకి డబ్బింగ్ చేయగా ఇక్కడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా సాయి కుమార్‌కి తిరుగులేని క్రేజ్ వచ్చింది.

ఇప్పుడు సాయి కుమార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రవితేజ ‘ఇరుముడి’, ‘ధ‌ర్మ‌స్థ‌ల నియోజ‌క వ‌ర్గం’, ‘సంబరాల ఏటిగట్టు’, నాగార్జున వందో చిత్రం, ఎస్వీ కృష్ణారెడ్డి వేదవ్యాస్, కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో ఓ సినిమా, రోషన్ మేక ‘ఏమో ఏమో ఇది’, విశ్వక్ సేన్ చిత్రం, సిద్దు జొన్నలగడ్డ ‘లుంగీ మాన్’, నితిన్-నాని మూవీ, సత్యదేవ్ ఫుల్ బాటిల్ సినిమా, వరుణ్ తేజ్ బరి, వరలక్ష్మీ శరత్ కుమార్ కూర్మావతారం, సాయి ప్రకాష్ సాయి బాబా సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

అంతే కాకుండా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మూడు లాంతర్లు’, కన్యాశుల్కం వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇక కన్నడలో శివ రాజ్ కుమార్ ‘బైల్’, నిరూప్ బండారి రూపొందిస్తున్న ‘సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర’, సుదీప్ బిల్లా రంగా భాషా చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇలానే సాయి కుమార్ మరెన్నో గొప్ప పాత్రలతో మెప్పిస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుందాం.

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago