కమిటీ కుర్రాళ్లు సందడి కంటిన్యూ అవుతూనే ఉంది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా యదువంశీ నామినేట్ అయ్యారు. ఈ ప్రెస్టీజియస్ నామినేషన్ దక్కడంతో ఎగ్జయిటింగ్గా ఉంది కమిటీ కుర్రాళ్లు టీమ్.
మన సంస్కృతిని, సంప్రదాయాలను, మన విలువలను, మనస్తత్వాలను అద్దం పట్టే కంటెంట్తో ప్రేక్షకులకు కన్విన్స్ చేసిన దర్శకులకు ఇఫి నామినేషన్ విభాగంలో చోటు దక్కుతుంది. తొలి చిత్రంతోనే ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. యావత్ దేశం గర్వించే ఈ విభాగంలో చోటు సంపాదించుకున్నందుకు తొలి చిత్ర దర్శకుడిగా యదువంశీ, కమిటీ కుర్రాళ్లు టీమ్ ఆనందానికి అవధుల్లేవు.
ఇప్పటికే పలు సందర్భాల్లో కమిటీ కుర్రాళ్లు మూవీకి మంచి గుర్తింపు లభించింది. 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో జాతీయ సమైక్యతకు కృషి చేసిన చిత్రంగా కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఉత్తమ డైరక్టర్గా యదువంశీకి పురస్కారం దక్కింది. దుబాయ్లో జరిగిన 2025 గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా)లోనూ ఢంకా భజాయించింది కమిటీ కుర్రాళ్లు. ఉత్తమ తొలి చిత్ర నిర్మాతగా నీహారిక కొణిదెల అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా యదువంశీని కూడా పురస్కారం వరించింది.
2025 సైమా అవార్డుల్లోనూ ఉత్తమ తొలి చిత్ర తెలుగు నిర్మాతగా నీహారిక కొణిదెల, ఉత్తమ తొలి చిత్ర తెలుగు నటుడిగా సందీప్ సరోజ్ అవార్డులను అందుకున్నారు.
పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన సినిమా ఇది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై తెరకెక్కింది. నీహారిక కొణిదెల సమర్పించారు. నీహారిక తొలి చలనచిత్ర సమర్పణ ఇది. ఇప్పటికీ పలు చోట్ల కనిపించే సామాజిక అసమానతలకు దివిటీ పట్టిన చిత్రమిది.
గోదావరి పరిసరాల్లోని అందాలను ఎదురోలు రాజు తన కెమెరాలో బంధించిన తీరు మెప్పించింది. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. తన సంగీతంలోని ప్రతి స్వరం ప్రేక్షకుల మనసులను తాకింది.
ఆంధ్రాలోని ఓ చిన్న పల్లెటూరిలోని కమిటీ కుర్రోళ్ల మధ్య జరిగిన పలు అంశాలకు సంబంధించిన కథ మూవీ లవర్స్ ని మెప్పించింది. సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, పి.సాయికుమార్, గోపరాజు రమణ, రాధ్య, ప్రసాద్ బెహర, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, యశ్వంత్ పెండ్యాల కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటిదాకా పొందిన గుర్తింపు:
* గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 – నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యునల్ హార్మనీ అండ్ సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్: ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (యదు వంశీ)
* గామా 2025 (దుబాయ్) – ఉత్తమ తొలి చిత్ర నిర్మాత (నీహారిక కొణిదెల) : ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (యదు వంశీ)
* సైమా 2025 – ఉత్తమ తొలి చిత్ర నిర్మాత (తెలుగు) (నీహారిక కొణిదెల): ఉత్తమ తొలి చిత్ర నటుడు (తెలుగు) (సందీప్ సరోజ్)
* ఇఫి 2025 (గోవా) – నామిని: ఉత్తమ తొలి చిత్ర భారత చలనచిత్ర దర్శకుడు
యదువంశీకి, ఇఫి నామినేషన్ కేవలం గుర్తింపు మాత్రమే కాదు. తన ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం. అంతకు మించి తనలోని ఆలోచనకు, సున్నితత్వానికి ప్రతీక. కమిటీ కుర్రోళ్లు సినిమాకు జాతీయంగా, అంతర్జాతీయంగా అందుతున్న ప్రశంసలు నీహారిక కొణిదెలలో కంటెంట్ డ్రైవన్ సినిమాలు చేయడానికి మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఫ్రెండ్షిప్, ఐక్యత, సామాజిక స్పృహతో గోదావరి తీరం నుంచి గ్లోబల్ స్టేజ్కి చేరుకున్న కమిటీ కుర్రోళ్లను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది టీమ్.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…