‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది

Must Read

సెంటిమెంట్ కాదు… ‘ఆర్ఎక్స్ 100’కి, ‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది – హీరో కార్తికేయ ఇంటర్వ్యూ

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

కార్తికేయకు 2012 అంటే మీకు ఏం గుర్తుకు వస్తుంది?
యుగాంతమే. అప్పట్లో నేను కాలేజీలో ఉన్నాను. వార్తల్లో, చర్చల్లో యుగాంతం అని ఎక్కువ వినిపించింది. హాలీవుడ్ సినిమాలు కూడా రెండు మూడు వచ్చాయి. అవి చూశా.

2012లో కార్తికేయకు, ఇప్పుడు 2023లో కార్తికేయకు మీరు గమనించిన మార్పు ఏమిటి?
మెచ్యూరిటీ పెరిగింది. అప్పుడు జీవితం అంతా తెలుసు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమీ తెలియదని అర్థమైంది. అప్పట్లో చేష్టలు పిల్లల తరహాలో ఉండేవి. ఇప్పుడు కాస్త పద్ధతిగా ఉంటున్నాను.

‘బెదురులంక 2012’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఆ కథ ఏమిటి?
అజయ్ భూపతి ద్వారా దర్శకుడు క్లాక్స్ నాకు పరిచయం అయ్యారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర వాళ్ళిద్దరూ కొలీగ్స్. కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా.

మీకు చెప్పిన కథను దర్శకుడు క్లాక్స్ తెరపైకి తీసుకొచ్చారా?
నిజం చెప్పాలంటే… ఈ కథ విన్నప్పుడు నాకు విజువల్ ఏమీ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్… కమర్షియల్ కథ విన్నప్పుడు అంతకు ముందు సినిమాల్లో విజువల్స్ ఫ్లాష్ అవుతాయి. సీన్స్ కొన్ని గుర్తు వస్తాయి. ‘బెదురులంక 2012’ కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నాను. రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. పంచ్ టు పంచ్ డైలాగులా కాకుండా సిట్యువేషన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ ఎక్కువ ఉంటుంది.

శివ శంకర వరప్రసాద్ పేరు మీరే సజస్ట్ చేశారట!?
సినిమాలో క్యారెక్టర్ పేరు శివ. ఆ సన్నివేశం దగ్గర ‘శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు’ అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనుకుంటున్నాం. సెట్‌లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాకు ఆ షాట్‌లో అలా చెప్పాం.

శివ క్యారెక్టర్ గురించి చెప్పండి!
శివ ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విష

యం చేయమంటే అసలు చేయడు.

రామ్ చరణ్ ట్రైలర్ విడుదల చేశారు కదా! ఆయన ఏమన్నారు?
ఆయనకు ట్రైలర్ నచ్చింది. మ్యూజిక్ బావుందని చెప్పారు. షాట్స్ మేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. నా గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం.

మీకు, నేహా శెట్టి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి? ప్రేమకథ ఎలా ఉండబోతుంది?
సిటీ నుంచి ఊరికి వచ్చిన యువకుడిగా నా క్యారెక్టర్ ఉంటే… బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన ప్రెసిడెంట్ గారి అమ్మాయిగా నేహా శెట్టి కనబడుతుంది. శివతో ప్రేమలో ఉంటుంది. శివ స్ట్రాంగ్ క్యారెక్టర్. అందరి ముందు ఐ లవ్యూ చెబుతాడు. ప్రేమించిన అబ్బాయికి లవ్యూ చెప్పడానికి అమ్మాయి భయపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండాలో, ఆ పరిధి మేరకు ఉంటాయి. సీన్స్ అన్ని క్యూట్ గా ఉంటాయి. సాంగ్స్, సీన్స్ షూట్ చేసినప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని అర్థమైంది.
డీజే టిల్లు’తో నేహా శెట్టికి క్రేజ్ వచ్చింది. మీ సినిమాలో పల్లెటూరి అమ్మాయి రోల్. దాని గురించి ఏమైనా భయపడ్డారా?


సినిమా స్టార్ట్ చేసినప్పుడు భయపడ్డాం. నేహా శెట్టి మంచి నటి. ‘డీజే టిల్లు’లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో… సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం.

‘ఆర్ఎక్స్ 100’లో మీ క్యారెక్టర్ శివ, గోదావరి నేపథ్యంలో కథ! ‘బెదురులంక 2012’లోనూ మీ పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా! సెంటిమెంట్‌ అనుకోవచ్చా?
యాదృశ్చికంగా జరిగింది. కథ నచ్చి రెండు సినిమాలు చేశా. క్యారెక్టర్ పేరు శివ అని చెప్పినప్పుడు క్లాక్స్ తో అనలేదు. చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు. ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.

కొత్త దర్శకుడు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా… నిర్మాత బెన్నీ ముప్పానేని సహకారం ఎలా ఉంది?
కథ 2012 నేపథ్యంలో, పల్లెటూరిలో జరుగుతుంది. ప్రజలు పరుగులు తీసే సీన్ ఒకటి ఉంది. ఎక్కువ మంది జనాలు కావాలి. ఖర్చు విషయంలో నిర్మాత అసలు రాజీ పడలేదు. కథ చెప్పడానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకొచ్చారు. కథానాయికగా నేహా శెట్టిని సజెస్ట్ చేశారు. ఆయన నిర్మాణంలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.

మణిశర్మ ఈ సినిమాకు ఎటువంటి బలాన్ని ఇచ్చారు?
మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్‌కోర్స్… సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే… ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు.

సాధారణంగా మణిశర్మ ఇంటర్వ్యూలు ఇవ్వరు. మీరు ఆయన్ను ఎలా ఒప్పించారు?
మణిశర్మ గారు ఓ బైట్ ఇస్తే బావుంటుందని అనిపించింది. ఆ విషయం దర్శకుడికి చెప్పా. క్లాక్స్ ఆయన్ను అడిగితే… ‘బైట్ ఎందుకు? నువ్వు, కార్తికేయ రండి. మనం మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూలా చేద్దాం! నేను ఇన్ని సినిమాలు చేశా. ఇటువంటి సినిమా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ సినిమా చేసిన ఫీలింగ్ ఉంది’ అని చెప్పారట. ఈ సినిమాకు రీ రికార్డింగ్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు.

‘బెదురులంక 2012’ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కారణాలు ఏంటి?
కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాను. సినిమాలు ప్రకటించలేదు గానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జానర్ ఫిల్మ్ అది. ప్రశాంత్ అని కొత్త దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నాను. మరో రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

‘ఆర్ఎక్స్ 100’కు సీక్వెల్ ఆశించవచ్చా?
‘ఆర్ఎక్స్ 100 – 2’ అని కాదు. అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. సరైన కథ కుదరాలి. కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం. అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తాం.

‘వలిమై’తో మీకు తమిళనాడులో మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకని, తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమాలు చేయడం లేదు?
‘వలిమై’ తర్వాత తమిళ ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అందుకని, ప్రతి సినిమాను తమిళ భాషలో విడుదల చేయాలని అనుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ అనుకున్నప్పుడు బైలింగ్వల్ చేస్తా. ‘వలిమై’ తర్వాత తమిళం నుంచి రెండు మూడు అవకాశాలు వచ్చాయి కానీ నాకు ఎగ్జైటింగ్ అనిపించలేదు. అందుకని, ఆ సినిమాలు చేయలేదు.

చిరంజీవి గొప్పతనం గురించి ఇటీవల మీరు చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు అభిమానిగా చేసినవేనా?
ఓ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పా. ఆయనకు నేను అభిమానిని. అంత కంటే ఎక్కువగా నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి గారు. సినిమాల పట్ల నాలో బాధ్యత పెంచిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనలా డ్యాన్సులు చేయాలని, హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చా. మా ఇంట్లో అమ్మ కూడా ‘వీడు ఒక్క పని సరిగా చేయడు. సినిమా అంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు’ అంటుంది. రెస్పాన్సిబిలిటీ రావడానికి కారణం ఆయన

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News