‘బాయ్స్ హాస్టల్’ టీమ్ ట్రైలర్ లాంచ్

బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫిల్మ్. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ‘బాయ్స్ హాస్టల్’ టీమ్

అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘బాయ్స్ హాస్టల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన ‘బేబీ’ టీమ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్,  తరుణ్ భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ‘బేబీ’ టీమ్ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

బాయ్స్ హాస్టల్ ట్రైలర్‌ హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయిల జీవితాలను ప్రజెంట్ చేసింది. వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, అల్లరిగా సరదాగా గడుపుతుంటారు. హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినప్పుడు వారికి పెద్ద సమస్య దురౌతుంది. హాస్టల్‌ కుర్రాళ్లు దీన్ని యాక్సిడెంట్‌గా మార్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది.  ట్రైలర్ హిలేరియస్మక్రేజీ మూమెంట్స్‌తో నిండిపోయింది. నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ తమ రియలిస్టిక్ యాక్టింగ్‌తో కథనంలో ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. తరుణ్ భాస్కర్ ప్రత్యేక పాత్రలో కనిపించగా, రిషబ్ శెట్టి, ఇతర ప్రముఖుల ప్రజన్స్ పెద్ద యాడ్-ఆన్. పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ సూపర్ హాట్ గా కనిపించింది.

దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్ B. P. , అరవింద్ S. కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్ , వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సురేష్ ఎమ్ ఎడిటర్ . బాయ్స్ హాస్టల్ ఆగస్ట్ 26న విడుదల కానుంది.  

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శరత్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసినప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకూ నవ్వుతూనే వున్నాను. సినిమా పూర్తయ్యేసరికి ఒక ఎనర్జీ వచ్చింది. ఇదొక క్రేజీ జోనర్ ఫిల్మ్. ఎడిట్స్ చాలా క్రేజీగా అనిపించాయి. ఈ సినిమాని రీమేక్ చేయడం కుదరదు. డబ్బింగ్ చేస్తామని సుప్రియ గారితో మాట్లాడి టీంని కలిశాం. డబ్బింగ్ సినిమా అంటే కొన్ని వాయిసులు రొటీన్ గా వినిపిస్తాయి. ఈ సినిమా యాభై పాత్రలు వున్నాయి. వాటి కోసం కొత్తగా యాభై వాయిస్ లు తీసుకొచ్చాం. ప్రతి పాత్ర బాడీ లాంజ్వేజ్ కి సరిపడే వాయిస్ తో ప్రోపర్ గా డబ్బింగ్ చేశాం. కార్తిక్ రత్నం లీడ్ వాయిస్ ఇచ్చారు. డైరెక్టర్ టీం కూడా పదిరోజులుగా మాతోనే వున్నారు. ట్రైలర్ చూస్తే లిప్ కూడా చాలా చోట్ల సింక్ అయివుటుంది. సినిమా బ్రిలియంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కన్నడ చూసిన వాళ్ళు కూడా తెలుగులో చూస్తే కొత్త అనుభూతిని ఇస్తుంది. థియేటర్ లో చూసినప్పుడు క్రేజీగా వుంటుంది. ట్రైలర్ ని బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన టీం అందరితో లాంచ్ చేయడం అనందంగా వుంది.’’ అన్నారు

అనురాగ్ రెడ్డి  మాట్లాడుతూ.. దాదాపు 500మంది థియేటర్ ఆర్టిస్ట్ లతో కలసి అంతా కొత్త కాస్టింగ్ తో ఈ సినిమాని క్రియేట్ చేశారు. ఇది మ్యాడ్ ఫిల్మ్. చాలా క్రేజీగా వుంటుంది. దిన్ని రిక్రియేట్ చేయడం అసాధ్యం. సినిమా అంతా లొల్లిగా వుంటుంది. ఆ లొల్లిలో మజాని 26న చూడబోతున్నారు.

రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ స్పెషల్ రోల్స్ చేశారు. చాలా ఇంట్రస్టింగా వుంటుంది.  ఈ ఈవెంట్ కి వచ్చిన బేబీ టీం అందరికీ థాంక్స్. అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్ కి థాంక్స్.  కాంతారకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, డీవోపీ ఈ చిత్రానికి పని చేశారు. ఫిల్మ్ మేకింగ్ ఎక్స్ టార్దినరిగా వుంటుంది. గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తెలుగులోకి తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకదేవో భవ.. మీ అందరి సపోర్ట్ కి కృతజ్ఞతలు’’ తెలిపారు.

సుప్రియ మాట్లాడుతూ.. చాయ్ బిస్కెట్ అనురాగ్ ఈ సినిమా ట్రైలర్ చూపించారు. చాలా ఫన్, ఎనర్జిటిక్ గా వుంది. అప్పుడే ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలని  భావించాం. నితిన్ అండ్ టీం అద్భుతంగా తీశారు’’ అన్నారు.

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వారం రోజుల్లోనే కన్ ఫార్మ్ అయ్యింది. షూటింగ్ కూడా అంటే ఫాస్ట్ గా జరిగింది. కన్నడలో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇలాంటి సినిమా తెలుగులో వస్తే మరో విజయం వచ్చినట్లే. చాలా రోజుల తర్వాత గ్లామర్ రోల్ చేయడం అనందంగా వుంది. మంచి టీంతో కలసి పని చేశాం. ఈ సినిమాలో భాగం కావడం అనందంగా వుంది’’ అన్నారు.

నితిన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలుపెట్టాం. కన్నడలో సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కు థాంక్స్. అలాగే ఈ ఈవెంట్ కి విచ్చేసిన బేబీ యూనిట్ కి కూడా థాంక్స్.  కొత్త ప్రతిభని ఆదరించడంతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుటారు. ఈ సినిమాని పెద్ద విజయం చేస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కార్తిక్ రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా చుస్తునప్పుడు చాలా క్రేజీగా అనిపించింది. మొదటి ఇరవై నిముషాలు క్రేజీ గా వుంటే తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. చాలా నచ్చింది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినందుకు చాలా హ్యాపీగా వుంది. సినిమా ఎక్స్ టార్దినరిగా వుంటుంది. అందరూ ఫ్యామిలీతో కలసి చూడండి’’అన్నారు.  

ప్రజ్వల్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కి థాంక్స్. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కన్నడలో ఈన చిత్రం పెద్ద విజయం సాధించింది. అదే ప్రేమని ఇక్కడ కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో బాయ్స్ హాస్టల్ ఎలా వుంటుందో ఒక ఐడియా వుంది. నితిన్ అద్భుతంగా ఈ సినిమా తీశారు. నిజంగా ఇలాంటి ఫాస్ట్ కట్స్ తో క్రేజీ సినిమా చేయడం అంత ఈజీగా కాదు.  చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ శరత్, అనురాగ్ మేజర్, రైటర్ పద్మభూషణ్, మేము ఫేమస్ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేశారు. హాస్టల్ బాయ్స్ ని కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తో డబ్ చేశారు. ఆగస్ట్ 26న సినిమాని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు.

 

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వేడుకకు రావడం అనందంగా వుంది. ఇలాంటి సినిమాలు  కోసం ఎదురుచూస్తుంటాం.  ఆగస్ట్ 26న సినిమాని ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు  

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. నితిన్ ఈ సినిమా అద్భుతంగా తీశారు. ఈ సినిమా ట్రైలర్ తెలుగులో చూస్తుంటే మజా వచ్చింది. ఈ సినిమా ఒక పండగలా వుంటుంది.  అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి సినిమా వస్తుందంటే వండర్ ఫుల్ గా వుంటుంది . ఆగస్ట్ 26న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు

ఎస్కేఎన్ మాట్లాడుతూ.. బేబీ విడుదలైన సమయంలోనే ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఇప్పుడీ సినిమాని తెలుగులోకి తీసుకురావడం అనందంగా వుంది.  ఆగస్ట్ 26న యూత్ అంతా సినిమా చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago