‘భలే ఉన్నాడే’ ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్ 

Must Read

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ప్రెస్ మీట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ లో శివసాయి వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్. తన కన్విక్షన్, సినిమాని చేసే విధానం అద్భుతంగా వుంది. నాకు డైరెక్టర్ అవ్వాలని వుందని ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన డైరెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుందని అర్ధమైంది. కిరణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు ప్రతిది సమకూర్చారు. మనీషా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. శేఖర్ చంద్రతో ఇది నా మూడో సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మారుతి గారితో ఎప్పటినుంచో సినిమా చేయాలని వుండేది. ఈ సినిమాతో కుదిరినందుకు చాలా హ్యాపీగా వుంది. సెప్టెంబర్ 7న సినిమా థియేటర్స్ లో రిలీజౌతుంది. ఇది ప్రోపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం. బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా థియేటర్స్ లో సినిమా చూడండి’ అన్నారు

హీరోయిన్ మనీషా కంద్కూర్ మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ మూవీ. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఇందులో రోమాన్స్, కామెడీ వుంది. మీ అందరికీ నచ్చుతుంది. టీం అంత చాలా సపోర్ట్ చేశారు. రాజ్ బెస్ట్ కో స్టార్. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. శేఖర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అందరూ థియేటర్స్ లో మూవీ చూసి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు. 

డైరెక్టర్ శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. భలే ఉన్నాడే నా ఫస్ట్ మూవీ. సినిమా కూడా చాలా బావుటుంది. నాకు అవకాశం ఇచ్చిన మారుతిగా గారికి థాంక్. రాజ్ తరుణ్ ఈ టైటిల్ కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఇందులో తను షారీ డ్రాపర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. అమ్మాయికి చీర కట్టాలంటే ఒక కంఫర్ట్బుల్ లెవల్ వుండాలి. దాని ప్రకారం ఈ క్యారెక్టర్ లుక్ ని డిజైన్ చేశాం. తను ఎందుకు ఇలా వున్నాడనేది సెప్టెంబర్ 7న తెలుస్తుంది. వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ఈవింగ్, నైట్ షో కి వెళితే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. చాలా హెల్దీ కామెడీ వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 

నిర్మాత కిరణ్ కుమార్.. ఇది మా ఫస్ట్ సినిమా. చాలా మంచి సినిమా తీశామనే నమ్మకం వుంది. సినిమా చాలా బావుటుంది. రాజ్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ థాంక్ యూ. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరికీ నచ్చుతుంది’ అన్నారు

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా సూపర్ ఎక్స్ పీరియన్స్. చాలా కొత్త జోనర్. సాంగ్స్ డిఫరెంట్ గా ట్రై చేశాం. రెండు పాటలు విడుదలయ్యాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. మారుతి గారు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. రాజ్ తరుణ్ తో ఇది మూడో సినిమా. రాజ్ క్రేజీ ఎనర్జీతో చేశారు. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.  

తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: జె శివసాయి వర్ధన్

ప్రెజెంట్స్: మారుతీ టీమ్

నిర్మాత: N.V కిరణ్ కుమార్

బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్

DOP: నగేష్ బానెల్లా

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

ఆర్ట్: సురేష్ భీమగాని

ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News