“భజే వాయు వేగం” సినిమా మా అందరి నమ్మకాన్ని నిలబెట్టింది

Must Read

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “భజే వాయు వేగం” సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాకు మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మంచి సినిమా తనను తానే నిలబెట్టుకుంటుంది. తనను తానే ప్రూవ్ చేసుకుంటుంది అనేందుకు ఈ సినిమా ఫలితమే నిదర్శనం. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

బీజీఎం అందించిన కపిల్ కుమార్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా మా టీమ్ అందరికీ ఎన్నో మంచి ఎక్సీపిరియన్స్ లు మిగిల్చింది. ఈ టీమ్ లో చివరగా జాయిన్ అయ్యింది నేనే. ఆరు నెలల పాటు ఈ సినిమా బీజీఎం కోసం వర్క్ చేశాం. దర్శకుడు ప్రశాంత్ నేను రోజూ బీజీఎం ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుని డిజైన్ చేశాం. ప్రశాంత్ తన కథకు బీజీఎం ఎలా ఉండాలో చాలా క్లియర్ గా చెప్పేవాడు. “భజే వాయు వేగం” సినిమాకు మ్యూజిక్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

ఎడిటర్ సత్య జి మాట్లాడుతూ – నేను, డైరెక్టర్ ప్రశాంత్ ఫ్రెండ్స్. యూవీలో రన్ రాజా రన్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎడిటర్ గా, ప్రశాంత్ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ సినిమా చేసి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. “భజే వాయు వేగం”తో డైరెక్టర్ గా ప్రశాంత్ కు హిట్ రావడం నాకు ఆనందాన్నిచ్చింది. మా అందరికీ సపోర్ట్ ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సక్సెస్ తో కార్తికేయ హీరోగా వంద అడుగులు ముందుకు వేశాడని భావిస్తున్నా. అతనికి మరిన్ని విజయాలు రావాలి. దర్శకుడు ప్రశాంత్ ప్రతిభకు దక్కిన చిన్న విజయమిది. ఆయన ఇంకా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనకు మెసేజ్ లు పంపించేవాడిని. నీలో చాలా టాలెంట్ ఉంది. దర్శకుడిగా ఎదుగుతావు అని. ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్ లో అతనికి పట్టు ఉంది. చాలా కన్విక్షన్ తో మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో కార్తికేయ నేను ఎలాంటి బేషజాలు లేకుండా కలిసి నటించాం. అందుకే స్క్రీన్ మీద మీకు అంత సహజంగా సీన్స్ వచ్చాయి. కపిల్ మ్యూజిక్, సత్య ఎడిటింగ్, మధు శ్రీనివాస్ డైలాగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నాకు ఇలాంటి మంచి మూవీలో అవకాశం ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్. “భజే వాయు వేగం” సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ – “భజే వాయు వేగం” మంచి సినిమా కాబట్టే ప్రేక్షకులు తమ మౌత్ టాక్ తో అందరికీ తెలిసేలా చేశారు. మా సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. మూవీ షూటింగ్ లో మా డైరెక్షన్ టీమ్ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. యూవీ వంశీ అన్న ప్రమోద్ అన్న విక్కీ అన్నకు థ్యాంక్స్. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ జాయిన్ అయ్యింది డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ అన్న. స్టోరీ డిస్కషన్ నుంచి సినిమా రిలీజ్ ముందు ప్రింట్స్ పంపించే టైమ్ లో చేసిన డైలాగ్ కరెక్షన్స్ వరకు నాతో ట్రావెల్ అయ్యారు. నా ఫ్రెండ్ సత్య. ఈ సినిమాకు కొన్ని వెర్షన్స్ ఎడిట్ చేయించా. ఎంతో పేసీగా సినిమాను ఎడిట్ చేశాడు. బీజీఎఎం చేసిన కపిల్ మా టీమ్ లో చివరగా జాయిన్ అయ్యి బెస్ట్ వర్క్ ఇచ్చాడు. రాహుల్ మా టీమ్ లో యాడ్ అవడం ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్యను ట్రైలర్ లో ఎందుకు చూపించలేదో మీకు సినిమా చూశాక అర్థమై ఉంటుంది. ఆమె కూడా అర్థం చేసుకుని మాకెంతో సపోర్ట్ చేసింది. ఐశ్వర్యకు థ్యాంక్స్. హీరో కార్తికేయ నన్ను ఎంతో నమ్మి ఈ సినిమాలో నటించాడు. ఒక్క రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ తన సపోర్ట్ ఈ మూవీకి ఎంతో ఉంది. కార్తికేయ లాంటి మంచి హీరోయిక్ పర్సనాలిటీ ఉన్నా ఆయన టోన్ డౌన్ చేసి సినిమాకు ఎంత కావాలో అంతే చూపించాను. రవిశంకర్, భరణి గారు ఇవాళ ట్రావెలింగ్ లో ఉండి సక్సెస్ మీట్ కు రాలేకపోయారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. కార్తికేయ లాంటి హీరో కొత్త దర్శకుడికి దొరికితే ఆ కంఫర్ట్ వేరేలా ఉంటుంది. అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా నాకు హీరోగా ఎంతో సంతృప్తినిచ్చింది. ఎలాంటి సినిమా చేయాలి అని అర్థం కాని టైమ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నాకు దారి చూపించడం తో పాటు విజయం అనే టార్చిలైట్ ఇచ్చాడు. ఏడాది టైమ్ లో రెండో సక్సెస్ అందుకున్నా. బెదురులంక తర్వాత “భజే వాయు వేగం” విజయాన్ని ఇచ్చింది. గతంలో నా గురించి రాసేప్పుడు మరో అపజయం అందుకున్నాడు అని రాసేవారు. ఇప్పుడు అనదర్ హిట్ అని రాస్తున్నారు. అవి చూస్తుంటే హ్యాపీగా ఉంది. “భజే వాయు వేగం” రిలీజ్ అయ్యాక మా డైరెక్టర్ ప్రశాంత్ కలెక్షన్స్, షోస్ పెరగడం గురించి మాట్లాడుతుంటే నేను రిలాక్స్ అవుతూ ఉండేవాడిని. అవేమీ నేను పట్టించుకోలేదు. ఒక మంచి మూవీ చేశాం అనే సంతృప్తి నాకు మిగతా అన్నింటికన్నా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక మంచి సినిమా అవుతుందని మేము “భజే వాయు వేగం” మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఇకపై నేను చేసే సినిమాలు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ మరో మంచి సినిమా చేశావంటూ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెబుతున్నారు. “భజే వాయు వేగం” సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ప్రతి స్టేజ్ లో మూవీ బెటర్ అవుతూ, మా నమ్మకం పెరుగుతూ వచ్చింది. అది ఇవాళ థియేటర్స్ లో ఆదరణ రూపంలో కనిపిస్తోంది. నాతో కలిసి నటించిన ఐశ్వర్య, రాహుల్, డైరెక్టర్ ప్రశాంత్, యూవీ బ్యానర్, మా మూవీ టీమ్ మెంబర్స్ అందిరికీ థ్యాంక్స్. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News