అమెరికాలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్.

Must Read

నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14 న అమెరికా న్యూ ఇంగ్లాండ్ లో శ్రీ బోళ్ల మరియు తరణి పరుచూరి అధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి “రావి అంకినీడు ప్రసాద్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి , శ్రీకాంత్ జాస్తి ,సురేష్ దగ్గుపాటీ, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి ,రావ్ కందుకూరి,శశాంక్ , దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని ” సహకరించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నందమూరి బాలయ్య అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు ఆ వీడియోలను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ వేడుకకు అమెరికాలోని జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్టింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీతా, శశాంక్ లు వ్యాఖ్యతగా వ్యవహరించగా, బాలయ్య అభిమానులల్లో మరింత జోష్ ను పెంచేందుకు సింగర్స్ హర్షిత యార్లగడ్డ, రాజీవ్ లు బాలయ్య పాటలను పాడి, ఆడి నందమూరి అభిమానులను అలరించారు.. అనంతరం ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శ్రీ శైలజ చౌదరి అండ్ గ్రూప్ వారి నృత్య ప్రదర్శన నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. వారి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది.

ఇక ఇటీవల సెప్టెంబర్ 1 వ తారీఖున హైదరాబాద్ లో బాలయ్య అభిమానులు, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక బాలకృష్ణ 1974 లోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి తాతమ్మ కల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. 50 ఏళ్లు గా సక్సెస్ ఫుల్ హీరోగా ఇప్పటికి వెలుగొందడం విశేషం.. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసారు.. కొన్ని పాత్రలకు బాలయ్య తప్ప మరెవ్వరు సెట్ కారు అన్నంతగా ఆ పాత్రలో జీవిస్తాడు. ఇలాంటి మరెన్నో చిత్రాలతో ప్రజల ముందుకు రావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు..

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. 1974 సంవత్సరంలో తాతమ్మ కల చిత్రంతో నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగారు నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ. అంతేకాకుండా ” తండ్రికి తగ్గ తనయుడుగా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య బాబు. బాలయ్య తన 50 సినీ ప్రస్థానంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సరసన సుమారు 129 మంది హీరోయిన్స్ ఆడిపాడారు. ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యధిక మంది హీరోయిన్లతో నటించిన తొలి నటుడు ఈయనే కావడం విశేషం. ఆయన కెరీర్ పరంగా చూస్తే హిస్టారిక్, బయోపిక్స్, మైథాలాజికల్, సైన్స్ ఫిక్షన్, సోషల్ వంటి అన్ని జానర్లలో నటించి రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News