‘బలగం’.. మార్చి 3న గ్రాండ్ రిలీజ్

Must Read

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని  ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేక‌ర్స్ బ‌ల‌గం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా.. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ‘‘‘బలగం’ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే ఉద్దేశంతో హ‌ర్షిత్‌, హ‌న్షిత క‌లిసి దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వేణుతో బ‌లగం సినిమాను చేశాం. ఈ సినిమాను మార్చి 3న మీ ముందుకు తీసుకు వ‌స్తున్నాం. తెలంగాణ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే సినిమా. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌లు స‌హా ప్ర‌తి ఒక పాత్ర మిమ్మ‌ల్ని హాంట్ చేస్తుంది. సినిమాను చూసిన వారందరూ అప్రిషియేట్ చేశారు. 

సినిమాలో హీరో తాత పాత్ర‌లో న‌టించిన సుధాక‌ర్ రెడ్డిగారు, హీరో తండ్రి పాత్ర‌లో న‌టించిన జ‌య‌రాం, అలాగే  నారాయ‌ణ పాత్ర‌లో ముర‌ళీధ‌ర్‌, హీరో మేన‌త్త పాత్రలో విజ‌య లక్ష్మి, హీరో త‌ల్లి పాత్ర‌లో స్వ‌రూప‌, హీరో బాబాయ్ పాత్ర‌లో మొగిలి ఇలా పాత్ర‌ల‌న్నీ మ‌న‌కు గుర్తుండిపోతాయి. ఒక‌ట్రెండు మిన‌హా మిగిలిన పాత్ర‌ల‌న్నింటిలో కొత్త వారినే తీసుకున్నాం. 

భీమ్స్ సంగీతంలో కాస‌ర్ల శ్యామ్ రాసిన పాట‌లు హృదయాల‌కు హ‌త్తుకుంటాయి. మంచి ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోష‌న్స్ కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఊరు ప‌ల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి  పాట‌లు వెళ్లాయి. సినిమా మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది’’ అన్నారు. 

న‌టీన‌టులు:  

ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జ‌య‌రాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఎ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్

స‌మ‌ర్ప‌ణ‌:  శిరీష్‌

ద‌ర్శ‌క‌త్వం:  వేణు ఎల్దండి

నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఆచార్య వేణు

కథా విస్తరణ స్క్రీన్ ప్లే: రమేష్ ఎలిగేటి – నాగరాజు మడూరి

సంగీతం:  భీమ్స్ సిసిరోలియో

ఎడిట‌ర్‌:  మ‌ధు

పాట‌లు:  శ్యామ్ కాస‌ర్ల‌

మాట‌లు: వేణు ఎల్దండి, రమేష్ ఎలిగేటి – నాగరాజు మడూరి

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  ర‌మ‌ణ వంక‌

పి.ఆర్.ఓ:  వంశీ కాకా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News