ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “డ్రింకర్ సాయి” సినిమా హైలైట్స్ హీరోయిన్ ఐశ్వర్య శర్మ తెలిపారు.
-“డ్రింకర్ సాయి” సినిమాలో నా క్యారెక్టర్ పేరు బాగీ. ఈ కథ విన్నప్పుడు నాది చాలా బలమైన క్యారెక్టర్ అనిపించింది. ఈ క్యారెక్టర్ ను జెన్యూన్ గా ప్రెజెంట్ చేయాలని బాధ్యతగా ఫీలయ్యాను. నటిగా నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని సీన్స్ ఇస్తే చేసి చూపించాను. అందులో పర్ ఫార్మెన్స్ నచ్చి ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. బాగీ క్యారెక్టర్ కు మీరు బాగా కనెక్ట్ అవుతారు.
-హీరో ధర్మతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పర్సనల్ గా చాలా మంచివాడు. “డ్రింకర్ సాయి” క్యారెక్టర్ కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం అతనిది. డైలాగ్స్ చెప్పడంలో నాకు సపోర్టివ్ గా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయి పాత్రలో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు.
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…
"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…