ఆర్.శ్రీధర్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియామకం

Must Read

ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాలకు పైగా చేయడంతో పాటు నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్ స్పందిస్తూ, తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని పేర్కొంటూ, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ కు, తెలంగాణ రాష్ట్ర బి.జె.పి. ప్రెసిడెంట్ బండి సంజయ్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నిర్మాతలు నట్టి కుమార్, జె.వి.మోహన్ గౌడ్ తదితరులు శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’.. యాక్షన్ మోడ్‌లో అదిరిన టీజర్‌

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా...

More News