గచ్చిబౌలిలో ‘రిదా రేడియన్స్’ అనన్య నాగళ్ల

Must Read

స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ప్రారంభించిన సినీ నటి అనన్య నాగళ్ల

** కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ ఇస్తాం : సీఈఓ సయ్యద్ కరిష్మా

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం. అన్నాడో కవి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. తాము అందంగా కనిపించడం కోసం స్త్రీ, పురుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అవసరమైనప్పుడల్లా కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూనే ఉంటారు. అలాంటి వారి అభిరుచికి అనుగుణంగా.. వాళ్లను మరింత అందంగా.. ఆకర్షణీయంగా చూపించేందుకు సిద్ధమైంది మా రిదా రేడియన్స్..

సినీ నటులు.. వ్యాపారవేత్తలు.. రాజకీయ నేతలు.. ఒక్కరేమిటి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే ట్రీట్మెంట్ ఇస్తుంది మా రిదా రేడియన్స్.

మిమ్మల్ని అందంగా చూపిస్తూ.. మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేస్తూ.. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మిమ్మల్ని చక్కగా చూపించి ఉన్నత స్థానంలో నిలబెట్టడమే మా ధ్యేయం. అందుకే గచ్చిబౌలిలోని ఫాంటసీ స్క్వేర్ లో మా రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సెంటర్ బ్రాంచ్ ని ప్రారంభించాము.

ఈ క్లినిక్ ను ప్రముఖ సినీనటి అనన్య నాగళ్ళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిదా రేడియన్స్ సీఈఓ సయ్యద్ కరిష్మా, ప్రముఖ యాంకర్, నటి సునైన, నటుడు రాజేశ్, డాక్టర్ శృతి, డాక్టర్ ఐశ్వర్య పులవర్తి, రిదా రేడియన్స్ మేనేజర్ సీమాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రిదా రేడియన్స్ సీఈఓ సయ్యద్ కరిష్మా మాట్లాడుతూ.. తమ రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్.. కువైట్ దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిందని అన్నారు. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో కూడా మన కస్టమర్లకు వినూత్న సేవలు అందించాలనే ఉద్దేశంతో.. గచ్చిబౌలిలోని ఫాంటసీ స్క్వేర్ లో తమ రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కువైట్ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

అనుభవజ్ఞులైన డాక్టర్లు..

తమ దగ్గర ఇద్దరు ఎంతో అనుభవజ్ఞులైన ఇద్దరు డెర్మటాలజిస్టులు ఉన్నారని, వారు అత్యున్నత సేవలు అందిస్తారని సీఈవో సయ్యద్ కరిష్మా పేర్కొన్నారు. స్కిన్ పరంగా గాని హేర్ పరంగా గాని ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తమ రిదా రేడియన్స్ చక్కని పరిష్కారం చూపిస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

50 శాతం డిస్కౌంట్..

చర్మ సౌందర్యానికి, ఇతర చర్మ సమస్యలకు తగు విధమైన చక్కటి పరిష్కారం.. హెయిర్ గ్రోత్ లో కలిగే ఇబ్బందులు తక్కువ కాలంలో పరిష్కరిస్తామని సీఈఓ కరిష్మా వెల్లడించారు. అలాగే రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా.. తమ క్లినిక్ కి వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కరిష్మా వెల్లడించారు. తమ సేవలు వినియోగించుకుంటారని తప్పక క్లినిక్ ను ఆదరిస్తారని ఈ సందర్భంగా ఆమె కోరారు. అనంతరం సినీనటి అనన్య మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండేలా గచ్చిబౌలిలో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అందంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ రిదా రేడియన్స్ హెయిర్ క్లినిక్ ను దర్శించాలని ఆమె కోరారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News