‘అలనాటి రామచంద్రుడు’ పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.  

Must Read

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటించిన లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్  బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. టాప్ ప్రొడక్షన్& డిస్ట్రిబ్యుషన్ సంస్థ SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఆగస్ట్ 2న గ్రాండ్ గా విడుదల ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.  

థాంక్స్ మీట్ లో హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ప్రేక్షక దేవుళ్ళు అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది. ఇప్పటివరకూ ప్రేక్షకుడిగానే సినిమాలు చూశాను. ఇప్పుడు మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు. మా నిర్మాతలు హైమావతి, శ్రీరామ్ జడపోలు, విక్రమ్, జగదీశ్ గారికి ధన్యవాదాలు. ఒక డెబ్యుటెంట్ కి ఇంత గొప్ప అవకాశం రావడం నా అదృష్టం. వారికి జీవితాంతం రుణపడి వుంటాను. సిద్దు పాత్ర నేను చేయగలనని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆకాష్ రెడ్డి గారికి చాలా థాంక్స్. ఈ సినిమా నా కెరీర్ లో మంచి మెమరీగా నిలిచిపోతుంది. మోక్ష అద్భతంగా నటించింది. తను బెస్ట్ కోస్టార్. కంపోజర్ శశాంక్ గారు సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ విజువల్స్ చాలా బ్యూటీఫుల్ గా వున్నాయిని చెబుతున్నారు. ఇంత మంచి విజువల్స్ ఇచ్చిన డీవోపీ ప్రేమ్ గారికి థాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మా గురువుగారు సత్యనంద్ గారికి కృతజ్ఞతలు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళుకు మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు’ తెలిజేశారు.

హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇందులో నేను చేసిన ధరణి పాత్ర నా మనసుకి చాలా దగ్గరైనది. చాలా ఒరిజినల్ క్యారెక్టర్. ఇంత అద్భుతమైన కంటెంట్ తీసిన దర్శక నిర్మాతలు ధన్యవాదాలు. డైరెక్టర్ ఆకాష్ గారు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఇది మనందరీ కథ. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా అద్భుతంగా వుంది. అందరూ చాలా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకుల సపోర్ట్ కి థాంక్ యూ సో మచ్’ అన్నారు.

డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మా సినిమాకి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు చాలా థాంక్స్. వాళ్ళు లేకపొతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. నా డైరెక్షన్ టీం చాలా కష్టపడ్డారు. శశాంక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇంత మంచి విజువల్స్ ఇచ్చిన ప్రేమ్ కి థాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యు సో మచ్’ అన్నారు.  

సంగీత దర్శకుడు శశాంక్ టి మాట్లాడుతూ.. సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు చాలా థాంక్స్. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. మ్యూజిక్ ఇంత బాగా రావడానికి కారణం ఆకాష్ సినిమా తీసిన విధానం. టీమ్ అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు.

కో- ప్రొడ్యూసర్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అలనాటి రామచంద్రుడు’ మ్యూజికల్ హిట్. ఈ హిట్ కోసం మా డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. శశాంక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కు చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు’ తెలిపారు.

ప్రొడ్యూసర్ శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి పాజిటివ్ టాక్ రావడం చాలా ఆనందంగా వుంది. అందరూ కొత్తవాళ్ళం కలసి చేసిన ప్రయత్నం ఇది. అన్ని సెంటర్స్ లో చాలా మంచి రెస్పాన్స్ వుంది. ఏ సెంటర్స్ లో మార్నింగ్ షోకి ఈవినింగ్ షోకి కలెక్షన్స్ పెరిగాయి. ఈ సినిమా ఖచ్చితంగా పిక్ అప్ అవుతుంది. సినిమా బెస్ట్ మ్యూజిక్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తోంది. శశాంక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయని ప్రతి రివ్యూలో చూశాను.  అలనాటి రామచంద్రుడు విలువల కోసం నిలబడ్డాడు. తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టం పడిన ప్రతీసారి ఎందరో సాయపడ్డారు. నా ప్రయాణంలో కూడా ప్రతి అడుగులో సాయపడిన వ్యక్తులు వున్నారు. ఈ సినిమాని ఇంత సక్సెస్ ఫుల్ గా చేయడానికి కారణం విక్రమ్. తనే మా వెంట నిలబడి నడిపించారు. ఆయనకి మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ.’ అన్నారు. ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News