‘అలనాటి రామచంద్రుడు’ హానెస్ట్ లవ్ స్టొరీ : కృష్ణ వంశీ &టీం  

Must Read

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్  బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  టాప్ ప్రొడక్షన్& డిస్ట్రిబ్యుషన్ సంస్థ SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఈ చిత్రాన్ని  ఆగస్ట్ 2న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. హైమావతి, శ్రీరామ్ జగదీశ్, విక్రమ్ , డైరెక్టర్ ఆకాష్ గారికి చాలా థాంక్స్. నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్. దిల్ రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఇందులో నా పాత్ర పేరు సిద్దు. తను రామచంద్రుడు లాంటి వాడే. చాలా ఇంట్రోవర్ట్. చాలా మంచి ఎమోషనల్ కోర్ వున్న సినిమా ఇది. ఆకాష్ గారు చాలా హానెస్ట్ గా తీశారు. ఆగస్ట్ 2న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు

డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలు థాంక్స్. ఇది ఈ జనరేషన్ కథ. చాలా హానెస్ట్ లవ్ స్టొరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ డ్రామా. ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ యంగ్ జనరేషన్ సినిమా చూస్తారని నముతున్నాను. కథ అనుకున్నపుడే కొత్తవారితో చేయాలని అనుకున్నాను. కృష్ణ వంశీ చాలా అద్భుతంగా నటించాడు. చాలా కష్టపడ్డాడు. ధరణి పాత్రలో మోక్ష పెర్ఫెక్ట్. ఆగస్ట్ 2న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ చూడాలి’ అన్నారు.  

హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ధరణి పాత్ర మెమరబుల్ గా వుంటుంది. ఇది క్లాసిక్ లవ్ స్టొరీ. దిల్ రాజు గారు రిలీజ్ చేయడం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాం. అందరూ తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి’ అని కోరారు.

నిర్మాత శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి మా కృతజ్ఞతలు. చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి సినిమా నచ్చి రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. హైనివా క్రియేషన్స్ లో మొదటి సినిమా ఇది. కొత్త ట్యాలెంట్ ని పరిచయం చేస్తూ ఈ సినిమా చేశాం. టీజర్ ట్రైలర్ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రయత్నం మేము చేశాం. అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచి కథ, ఎమోషన్, మ్యూజిక్, విజువల్స్ వున్న సినిమా ఇది. ఈ జనరేషన్ కి కావాల్సిన ప్యూర్ లవ్ ఈ సినిమాతో చూపించబోతున్నాం. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆగస్ట్ 2న సినిమా విడుదలౌతుంది. ఖచ్చితంగా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News