యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’ 

Must Read

సెన్సార్ పూర్తి  చేసుకున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’ 

వైవిధ్య‌మైన జోన‌ర్స్ క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక‌రు. ఈ టాలీవుడ్ స్టార్ ప్ర‌తీ సినిమాకు త‌న విల‌క్ష‌ణ‌త‌ను చూపిస్తూనే వ‌స్తున్నారు. తాజాగా ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాను తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో గూజ్ బంప్స్ తెప్పించే యాక్ష‌న్ స‌న్నివేశాలను చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ట్రైల‌ర్, సాంగ్ రిలీజ్ త‌ర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. 

తాజాగా ‘గాండీవ‌ధారి అర్జున’ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. 2 గంట‌ల 18 నిమిషాలుగా మేక‌ర్స్ ఈ సినిమా ర‌న్‌టైమ్‌ను లాక్ చేశారు. సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆక‌ట్టుకునే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో పాటు సినిమాలోని మంచి మెసేజ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 

వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాజ‌ర్‌, విమ‌లా రామ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌టీన‌టులు న‌ట‌న‌, సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ ప్రేక్ష‌కుల‌కు ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. యూనిక్ స్టోరీల‌తో సినిమాల‌ను డైరెక్ట్ చేసే బ్రిలియంట్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు త‌న‌దైన పంథాలో ‘గాండీవ‌ధారి అర్జున’ సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గానే కాకుండా ప్రేక్ష‌కుల‌కు మంచి ప్ర‌భావాన్ని చూపేలా తెర‌కెక్కించారు. 

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాణ సంస్థ చేసే సినిమాల్లోని ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ గొప్ప‌గా ఉండ‌ట‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌కు ఓ గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఉంటాయి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాప‌ర్‌గా అవినాస్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. 

ప్ర‌పంచ వ్యాప్తంగా ‘గాండీవధారి అర్జున’ ఆగస్ట్ 25న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News