క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది

Must Read

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది. ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన ఎడ్యుకేషన్ సిస్టం వల్ల యువత ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాలు తోడేస్తున్నాం. చాలా దేశాల్లో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టం లేదు. కొన్ని దేశాల్లో పిల్లలకు ప్రకృతి తోనే ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్  తల్లిదండ్రులకు పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. తన సిస్టం లో ఖచ్చితమైన మార్పు రావాలి లేకపోతే పిల్లలు ఇంకా నలిగిపోతారు. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి. 

నా చిత్రం ఒక స్టూడెంట్ కొన్నాం నుంచి ఉంటుంది. స్టూడెంట్స్ పడే బాధలు ఎలా ఉంటాయో చుపించాము. ఈ రోజుల్లో మనకి పలానా దాని గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్ ని అడిగితే చెప్పేస్తుంది మరి ఇంకా చదువుని భట్టి పెట్టాల్సిన అవసరం ఏంటి, క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది. ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకేక్కిన్చాము. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు చదువుతో పాటు తన మీద తనకు విశ్వాసం కలిగించాలి కానీ ర్యాంకులు కాదు అనే అంశాన్ని ఈ చిత్రంలో చెప్పాము. మనోజ్ నందన్, చక్రవర్తి, మనీషా మరియు సోనీ రెడ్డి ముఖ్య పాత్రలు చేశారు. ఈ నాలుగు పాత్రలో యూత్ ప్రేక్షకులు తమని తాము చూసుకుంటారు. అందరూ చాలా బాగా చేశారు. మేము కొంత మంది టీచర్ కి స్టూడెంట్ కి మా చిత్రాన్ని చుపించాము, అందరూ సినిమా చాలా బాగుంది అని తెలిపారు. చాలా కాలేజెస్ సినిమా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 28న విడుదల అవుతుంది. 

ఈ సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్‌కి ప్రతి స్టూడెంట్‌ కనెక్ట్‌ అవుతాడు. తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌ చూడాల్సిన చిత్రం ఇది. ఈ సినిమా కోసం కొందరు స్టూడెంట్స్‌తో మాట్లాడటం జరిగింది. మన విద్యావ్యవస్థలోని అంశాలను సీరియస్‌గా చూపిస్తే అంతగా నచ్చకపోవచ్చు. అందుకే అవే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం.చదలవాడ శ్రీనివాస రావు గారితో మరో సినిమా ప్లాన్ లో ఉంది. ప్రస్తుతానికి ట్రాన్స్ జెండర్ వాళ్ళ మీద ఒక సినిమా చేస్తున్న. ప్రస్తుతానికి స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాము” అని తెలిపారు. 

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్

బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్

నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా,  వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు

కెమెరా మాన్  & ఎడిటింగ్ : సాబు జేమ్స్

సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.  

కలరింగ్ అమల్

వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ

పి ఆర్ ఓ : పాల్ పవన్

సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు

దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News