స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘అజయంతే రందం మోషణం’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ క్యారెక్టర్స్ మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషించనున్నారు. సుజిత్ నంబియార్ ఈ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
‘అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ కృతి శెట్టికి ఇది మొదటి మలయాళ చిత్రం. బాసిల్ జోసెఫ్, కిషోర్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి, జగదీష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూజీఎం ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేజిక్ ఫ్రేమ్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనుంది. ఈ సినిమా కథలో కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్కు ఎక్కువ ప్రాధాన్యత వుంది. ఈ చిత్రానికి తమిళ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ దీపు నైనాన్ థామస్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నందున టోవినో ఇటీవల కలరి విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
ప్రొడక్షన్ డిజైనర్- గోకుల్ దాస్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రవీణ్ వర్మ
మేకప్ – రోనెక్స్ జేవియర్
ప్రొడక్షన్ కంట్రోలర్ – బాదుషా
ఎడిటింగ్ – షమీర్ మహ్మద్
ఛాయాగ్రహణం – జోమోన్ టి జాన్
పీఆర్వో – వంశీ- శేఖర్
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…