‘లవ్ మీ’ సక్సెస్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

Must Read

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేశారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

ఆశిష్ మాట్లాడుతూ.. ‘చాలా కొత్త సినిమా. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. ఈ కొత్త మూవీని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మా సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది హారర్ కాదు.. దెయ్యాన్ని చూసి భయపడటం కాదు.. ప్రేమించడం అనే కాన్సెప్ట్ మీద తీశాం. కొత్త అటెంప్ట్ చేసినా ఆదరిస్తారని ఆడియెన్స్ మళ్లీ నిరూపించారు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఏ సినిమాకు అయినా ఇలాంటివి కామన్. థియేటర్లో మా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేం కూడా థియేటర్ టూర్ ప్లాన్ చేశామ’ని అన్నారు.

అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘మేం చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆడియెన్స్ ఎగ్జైట్ అవుతారని అనుకున్నానో.. అక్కడ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మెల్లిమెల్లిగా అందరికీ అర్థం అవుతుంది. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుంది. నా పేరు అరుణ్ కాదు. నా ఫ్రెండ్ పేరు అరుణ్. వాడు చాలా బాగా రాస్తాడు. వాడిలా ఆలోచించడానికి, రాయడానికి వాడి పేరు పెట్టుకున్నా. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మెల్లిగా అందరికీ అర్థం అవుతుంది. వైష్ణవి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాలు ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు థాంక్స్’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ఇదొక డిఫరెంట్, యూనిక్ మూవీ అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి చేశారు. ఏ ట్విస్ట్‌కి ఎలా రియాక్ట్ అవుతారని అనుకున్నామో.. ఆడియెన్స్ అలానే రియాక్ట్ అయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమాను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత హన్షిత మాట్లాడుతూ.. ‘మా సినిమాకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మూతబడిన థియటర్లు తెరుచుకుంటున్నాయి. ఇంటర్వెల్‌కు ముందు జనాలు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇదేమీ హారర్ మూవీ కాదు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. అందరూ తప్పకుండా మా సినిమాను చూడండి’ అని అన్నారు.

నాగ మల్లిడి మాట్లాడుతూ.. ‘కొత్త కంటెంట్, ప్రయోగం చేసినప్పుడు డివైడ్ టాక్ కచ్చితంగా వస్తుంది. కానీ త్వరలోనే ఈ మూవీకి యూనానిమస్ రెస్పాన్స్ వస్తుంది. స్లోపాయిజన్‌లా అందరికీ ఎక్కేస్తుంది. మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News