సినిమా , టీవీ రంగాళ్లలో ప్రసిద్ధుడైన నటుడు బొడ్డు రాజబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుందని , ఆయన జయంతి సందర్భంగా స్నేహితులు నిర్వహించిన స్మారక అవార్డుల కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని దర్శకుడు బి .గోపాల్ చెప్పారు.
నటుడు రాజబాబు 67వ జయంతి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో గురువారం లో జరిగింది . ఇందులో ముఖ్య అతిధిగా గోపాల్ పాల్గొన్నారు . ఏ వ్యక్తినైనా చనిపోయిన తరువాత గుర్తు పెట్టుకొని స్నేహితులు కార్యక్రమం నిర్వహించడం అపూర్వమైన విషయమని , రాజబాబు స్నేహితులు కె .వి .బ్రహ్మం , నర్రా వెంకటరావు ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాని గోపాల్ తెలిపారు .
నిర్మాతల మండలి అధ్యక్షులు , ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – గత మూడు సంవత్సరాలుగా రాజబాబు జయంతి ఉత్సవాలకు హాజరవుతున్నాని , ఇది ఎందరికో స్పూర్హిగా నిలవాలని తాను కోరుకుంటున్నాని న, సినిమా , టీవీ , నాటక రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి రాజబాబు స్మారక అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .
నటుడు , గాయకుడు , కవి గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ – రాజబాబు తో తనకు ఎంతో అనుబంధం ఉందని , ఆయన మంచి నటుడే కాదు స్నేహశీలి అని చెప్పారు . తన పేరుతో ఏర్పాటైన ట్రస్టు ద్వారా ఇచ్చే అవార్డుల్లో వచ్చే సంవత్సరం నుంచి రాజబాబు పేరుతో ఒక అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు .
దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు మాట్లాడుతూ – సినిమా రంగానికి తానె పరిచయం చేశానని , రాజబాబు జయంతి రోజు ఇలా ప్రతిభావంతులను సత్కరించడం ఎంతో తృప్తిగా ఉందని చెప్పారు .
నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .- ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వచ్చారని , త్వరలో నంది అవార్డుల ప్రదానం ఉంటుందని , టీవీ అవార్డుల్లో రాజబాబు స్మారక అవార్డును కూడా ప్రవేశ పెట్టడానికి తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు .
రాజబాబు స్మారక అవార్డుల కమిటీ చైర్మన్ కె .వి .బ్రహ్మం మాట్లాడుతూ – రాజబాబుది విలక్షణమైన వ్యక్తిత్వం , అందరినీ ఆత్మీయంగా ప్రేమించే గొప్ప మనిషి, అలాంటి స్నేహితుణ్ని కోల్పోవడం మా అందరికీ బాధ కలిగిస్తుందని , ఆయన ఎప్పటికీ గుర్తుండేలా ఈ అవార్డులకు ప్రదానం చేస్తున్నామని , ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుందని, ఈ అవార్డుల ఎంపికలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సహకరించారని చెప్పారు .
ఈ కార్యక్రమంలో నిర్మాత సి .వి రెడ్డి , దర్శకుడు పి .సాంబశివరావు , నటి అన్నపూర్ణమ్మ , గుమ్మడి గోపాకృష్ణ , పి వి .ఎన్ .కృష్ణ, పత్తి ఓబులయ్య , డాక్టర్ రఘునాథ బాబు , ప్రవీణ్ చంద్ర , గోపి కసిరెడ్డి , వాసు ఇంటూరి , కొర్రపాటి వెంకటేశ్వర రావు , సద్దుల మధుసూదన్ లను రాజబాబు స్మారక అవార్డులతో సత్కరించారు .
మల్లికార్జున్ కార్యక్రమాన్ని నిర్వహించారు .
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…