మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఆరంభం’ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్

Must Read

‘C/o కంచరపాలెం’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

టైమ్ ట్రావెల్, డెజా వూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది,

భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ విడుదలైయింది.

‘ఆరంభం’ కథలోకి వస్తే, ఖైదీ నంబర్ 299 కాలాఘటి జైలు నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్‌లు వస్తారు. వారి పరిశోధనలో ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వస్తాయి.

టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తోంది,

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ని మిస్ అవ్వకండి.

తారాగణం:
మోహన్ భగత్
సుప్రీత సత్యనారాయణ
భూషణ్
రవీంద్ర విజయ్
లక్ష్మణ్ మీసాల
బొడ్డేపల్లి అభిషేక్
సురభి ప్రభావతి

సిబ్బంది-
దర్శకుడు: అజయ్ నాగ్ వి
నిర్మాత: అభిషేక్ వి తిరుమలేష్
ప్రొడక్షన్ హౌస్: AVT ఎంటర్టైన్మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ రెడ్డి మామిడి
సీఈవో: ఉజ్వల్ బీఎం
డీవోపీ: దేవదీప్ గాంధీ కుండు
లైటింగ్ చీఫ్: రజత్ మన్వానీ
ఎడిటర్: ఆదిత్య తివారీ, ప్రీతం గాయత్రి
సంగీత దర్శకుడు: సింజిత్ యర్రమిల్లి
సౌండ్ డిజైనర్: మాణిక్క ప్రభు సిఎస్
థీమ్ సాంగ్ కంపోజర్: బిప్రదీప్ దత్తా
కాస్ట్యూమ్ డిజైనర్: హారిక పొట్ట
విప్లవ్ నిషాదమ్ (విప్లవ్ ఎడిట్ వర్క్స్) ప్రోమోలు, టీజర్ ట్రైలర్
డైలాగ్స్: సందీప్ అంగడి
సాహిత్యం: స్వరూప్ గోలి, శ్రీకాంత్ అల్లపు, కిట్టు విస్సాప్రగడ, అభిజ్ఞ రావు
మ్యూజిక్ సూపర్‌వైజర్: కల్మీ
డీఐ: రాజు
VFX: మ్యాజిక్ B

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News