మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో కూడిన ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మేకర్స్ మూవీపై వున్న ఎక్సయింట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెలుతున్నారు. ఈరోజు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ అవతార్ లోఉన్న కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. అమితాబ్ యుద్దభూమి మధ్యలో నిలబడి, అస్త్రాన్ని పట్టుకుని, నుదిటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి, యుద్ధానికి సిద్ధంగా వున్నట్లుగా కనిపించారు. అతని వెనుక ఒక లైఫ్ సైజు వెహికిల్ తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడివుండటం గమనించవచ్చు.
“అతని నిరీక్షణ ముగుస్తోంది… మూడు రోజుల్లో #Kalki2898AD ట్రైలర్, జూన్ 10న విడుదల” అని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.
https://www.instagram.com/p/C75-X9BvxdL/?igsh=MWx3NG1qM3Jkdmw5aQ==
అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర మధ్యప్రదేశ్లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద ఒక మ్యాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నెమవార్, నర్మదా ఘాట్ల ఎంచుకోవడం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా మైదానంలో నడుస్తాడని నమ్ముతారు. ఈ మూవీ, తన పాత్ర కోసం అభిమానుల్లో మరింత ఎక్సయిట్మెంట్ పెంచింది.
‘కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…