తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకున్న “గం..గం..గణేశా”

Must Read

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన “గం..గం..గణేశా” ఆడియెన్స్ కు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి బాక్సాఫీస్ నెంబర్స్ మరింతగా పెరగనున్నాయి.

“గం..గం..గణేశా”లో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. “గం..గం..గణేశా” సినిమా హీరో ఆనంద్ దేవరకొండను సరికొత్తగా తెరపై ఆవిష్కరించింది. మంచి ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో ఆనంద్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.

Latest News

సినీ ప్రముఖుల చేతుల మీదుగా‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా, రమేష్ చెరుకూరు దర్శకత్వంలో, సావిత్రమ్మ...

More News