శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా ‘అల్లూరి’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నేచురల్ స్టార్ నాని  

Must Read

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు.

తనికెళ్ల భరణి ఒక యువకుడి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైయింది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచమయ్యారు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను వైలెంట్ గా మారుతాడు. నక్సలైట్లు, నేరస్తుల్లో మార్పు తీసుకువస్తాడు. కానీ అతను అధిగమించడానికి ఇంకా పెద్ద అడ్డంకులు వుంటాయి. పోలీస్ ఉద్యోగం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు

అల్లూరి స్పూర్తిదాయకమైన ప్రయాణం ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు. శ్రీవిష్ణు అద్భుతమైన నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శ్రీవిష్ణు భార్యగా కయదు లోహర్ తన పాత్రను చక్కగా పోషించింది.

ప్రదీప్ వర్మ తన రైటింగ్, టేకింగ్‌తో మంచి ఇంప్రెషన్‌ని కలిగించాడు. రాజ్ తోట కెమెరా పనితనం చక్కగా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం పవర్ ఫుల్ గా వుంది. అల్లూరి గ్రిప్పింగ్ పోలీస్ డ్రామాగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..  అల్లూరి ట్రైలర్ చాలా బావుంది. అలాగే శ్రీవిష్ణుకి కూడా కొత్తగా వుంది. విష్ణు కమర్షియల్ యాక్షన్ సినిమా చేయడం ఇదే మొదటిసారని అనుకుంటున్నాను. చాలా ఎనర్జిటిక్ గా వుంది. ఈ మధ్య కాలంలో ఎనర్జిటిక్ ఫిలిమ్స్ ని ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అల్లూరి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది వుంటారు. అలాంటి నటుల్లో ముందు వరుసలో వుండే హీరో శ్రీవిష్ణు. అందుకే శ్రీవిష్ణు అంటే నాకు చాలా ఇష్టం. శ్రీవిష్ణు కథల ఎంపిక చాలా బావుంటుంది. విష్ణు రియల్ లైఫ్ లో చాలా పెద్ద ఎంటర్ టైనర్. పర్శనల్ గా కలుస్తున్నపుడు శ్రీవిష్ణు విశ్వరూపం చూశాను. విష్ణులో ఆ ఎంటర్ టైనర్ కోణం కూడా బయటికి రావాలని కోరుకుంటాను. అది మీ అందరికీ నచ్చుతుంది. బయట చాలా రిజర్వడ్ గా వుండి లోపల చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను. మహేష్ బాబు గారి తర్వాత శ్రీవిష్ణు ఆ కోవకి వస్తారు. శ్రీవిష్ణు కూడా అంత పెద్ద స్టార్ అయిపోవాలి. ఇప్పటికే మంచి నటుడనే పేరు వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను. బెక్కెం వేణుగోపాల్ గారితో నేను లోకల్ చేశాను. ఆయన ఒక సినిమాని నిర్మిస్తారని అనడం కంటే దత్తత తీసుకుంటారని అనడం సబబు. సినిమా చేస్తున్నంత కాలం ఆ యూనిటే ఆయన కుటుంబం. అంతచక్కగా అందరినీ చూసుకుంటారు. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని చూస్తారు. గత రెండు నెలల్లో అది మళ్ళీమళ్ళీ రుజువైయింది. అల్లూరి కూడా గొప్ప విజయం సాధిస్తుంది. చిత్ర యూనిట్ అంతటికి ఆల్ ది వెరీ బెస్ట్” తెలిపారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ కి వచ్చిన నాని గారికి థాంక్స్. ప్రదీప్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా ప్రేక్షకులకు చెప్పాలని అనుకున్నాం. బెగ్గం వేణుగోపాల్ గారు ఈ నిజాయితీ గల కథని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గారు రావడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నాని గారంటే నాకు చాలా ఇష్టం. నాకు నాని గారు స్ఫూర్తి. ఎంతోమంది నానిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీ వస్తారు. చాలా మంది దర్శకులకు నాని గారితో పని చేయాలని వుంటుంది. అల్లూరి సినిమాకి పని చేసిన అందరూ చాలా వండర్ ఫుల్ వర్క్ ఇచ్చారు. అల్లూరి చాలా నిజాయితీ గల గొప్ప సినిమా. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ కి మ్మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను”

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని గారికి కృతజ్ఞతలు. నాని గారిని చూస్తే చాలా పాజిటివ్ గా వుంటుంది. నాని గారితో తీసిన నేను లోకల్ సినిమా గొప్ప జ్ఞాపకం. ఆయన ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. అల్లూరి అద్భుతమైన కంటెంట్ వున్నా సినిమా. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా ఇంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది. మా హీరో శ్రీవిష్ణు గారితో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి  కృతజ్ఞతలు. సెప్టెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

గేయ రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. అల్లూరి అంటే పవర్. పోలీస్ అంటే పవర్.. మరో పవర్ శ్రీవిష్ణు. ఈ మూడు పవర్స్ ని కలిపి పవర్ ఫుల్ సినిమా తీశారు ప్రదీప్ వర్మ. ఈ సినిమాలో అన్ని పాటలు రాశాను. వజ్రాయుధం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బెక్కం వేణుగోపాల్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. అల్లూరి పెద్ద హిట్ అవుతుంది” అన్నారు

సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ చిత్రానికి ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  

అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ప్రదీప్ వర్మ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
బ్యానర్: లక్కీ మీడియా
సమర్పణ: బెక్కెం బబిత
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: రాజ్ తోట
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్ డైరెక్టర్: విఠల్
ఫైట్స్: రామ్ క్రిషన్
సాహిత్యం: రాంబాబు గోసాల
సౌండ్ ఎఫెక్ట్స్: కె రఘునాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News