కీర్తి సురేష్, నవీన్ కృష్ణ జంటగా రూపొందిన చిత్రం `జానకిరామ్`. బేబీ శ్రేయారెడ్డి సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై రాంప్రసాద్ రగుతు దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ….“ఇటీవల విడుదల చేసిన మా చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హ్యుమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ గారి తనయుడు నవీన్ కృష్ణ హీరోగా నటించాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. అచ్చు రాజమణి గారు ఏడు అద్భుతమైన పాటలు కంపోజ్ చేశారు. మెగాబ్రదర్ నాగబాబు గారు కీలకమైన పాత్రలో నటించారు. కీర్తి సురేష్ , నవీన్ కృష్ణ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీర్తి సురేష్ అందం, అభినయంతో పాటు నవీన్ కృష్ణ పర్పార్మెన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన రాంప్రసాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో సప్తగిరి, పోసాని, రాహుల్ దేవ్ , రఘు కారుమంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. మరో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని నటించింది. త్వరలో సినిమా విడదుల తేదీ ప్రకటిస్తాం“ అన్నారు.
కీర్తి సురేష్, నవీన్ కృష్ణ, చాందిని, పోసానికృష్ణ మురళి, నాగబాబు, రాహుల్ దేవ్, సప్తగిరి, రాఘవ, రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః అచ్చు రాజమణి, డిఓపీః సురేష్ రగుతు; పీఆర్వోః రమేష్ చందు; డైలాగ్స్ః సురేష్ వర్ధినేది; కో-ప్రొడ్యూసర్ః టి.రమేష్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః పవన్ రెడ్డి కోటిరెడ్డి; నిర్మాతః తమటం కుమార్ రెడ్డి; డైరక్టర్ః రామ్ ప్రసాద్ రగుతు.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…