వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న ‘జీ తెలుగు’ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ‘జీ సూపర్ ఫామిలీ’ షోకి దీటుగా ఇప్పుడు ‘లేడీస్ & జెంటిల్మెన్’ అనే మరో ఎంటర్టైనింగ్ షోని సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రతివారం ముగ్గురు సరికొత్త సెలబ్రిటీ కపుల్స్ లేదా ఫ్రెండ్షిప్ జోడీలు తరలివచ్చి వీక్షకులను అలరించనున్నారు. అంతేకాదు, ఈ ఆదివారం రెట్టింపు వినోదాన్ని పంచడానికి మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ని — ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ — సాయంత్రం 6 గంటలకు ప్రజల ముందుకు తీసుకురానుంది ‘జీ తెలుగు’.
‘లేడీస్ & జెంటిల్మెన్’ మొదటి ఎపిసోడ్లో భాగంగా సెలబ్రిటీ కపుల్స్ అలీ-జుబేదా, మనో-జాలీమా, మరియు బాబా భాస్కర్-రేవతి మూడు ఫన్నీ రౌండ్లలో తలపడి సందడి చేయనున్నారు. అదేవిధంగా, ఈ సెలబ్రిటీ కపుల్స్ ప్రదీప్ ని పెళ్లి విషయంలో ఏడిపించిన విధానం మరియు అతనికి వారు ఇచ్చిన టిప్స్ అందరిని నవ్వించనున్నాయి.
‘లేడీస్ & జెంటిల్మెన్’ తో 90 నిమిషాల ప్యూర్ ఎంటర్టైన్మెంట్ తరవాత ఈ డోస్ ని మరి కాస్త పెంచుతూ సాయంత్రం 6 గంటలకు ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ (వెంకీ), వరుణ్ తేజ్ (వరుణ్), తమన్నా భాటియా (హారిక), మరియు మెహ్రీన్ పిర్జాదా (హనీ) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ కుటుంబ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కథ విషయానికొస్తే, వెంకీ, వరుణ్, హారిక-హనీ & ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్తను మోసం చేసి రాత్రికిరాత్రి కోటీశ్వరులు అవ్వాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. మరి ఆ ప్రయత్నంలో ఎవరు విజయం సాధిస్తారు, ఈ ప్రయాణంలో వారు ఏం తెలుసుకుంటారో తెలియాలంటే ఈ ఆదివారం నాడు ‘F3’ సినిమాను జీ తెలుగులో వీక్షించండి.
సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ‘లేడీస్ & జెంటిల్మెన్’ మరియు సాయంత్రం 6 గంటలకు ‘F3’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ని తప్పక వీక్షించండి, మీ జీ తెలుగులో
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…