ఆయ్’ ట్రైలర్ ఎన్టీఆర్‌గారికి బాగా న‌చ్చింది..  నార్నే నితిన్‌

విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో మెప్పించిన డైనమిక్ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్ మీడియాతో ‘ఆయ్’ సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు..

* సినిమాకు ముందుగా ‘ఆయ్’ అనే టైటిల్‌ను అనుకోలేదు. అర‌వింద్‌గారి ఆలోచనతోన ఈ టైటిల్ పెట్టాం. అందుకు కార‌ణం.. గోదావ‌రి స్లాంగ్‌లో ఆయ్ అనే ప‌దాన్ని కామ‌న్‌గా వాడుతుంటాం. అలాగే సినిమాలోని ప‌లు సంద‌ర్భాల్లో ఈ ప‌దాన్ని వాడ‌టాన్ని చూడొచ్చు. కాబ‌ట్టే టైటిల్‌ను ‘ఆయ్’ అని ఫిక్స్ చేశాం.

* సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. కాబ‌ట్టి పోస్ట‌ర్స్‌లో అంతా ఫ‌న్ బాత్ అనే పెట్టాం. ఇది డైరెక్ట‌ర్‌గారి ఆలోచ‌న‌. సినిమా విడుద‌లైన రోజున ఆ విష‌యం స్ప‌ష్టంగా అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది.

* ఆగ‌స్ట్ 15న చాలా సినిమాలు రిలీజ్‌లున్నాయి. అయితే మాకుండాల్సిన ఆడియెన్స్ మాకున్నార‌ని అనుకుంటున్నాం. మంచి ఫ‌న్ ఉన్న గోదావ‌రి బ్యాక్ డ్రాప్ మూవీ వ‌చ్చి చాలా కాల‌మైంది. క‌చ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం.

* చిన్న‌ప్ప‌టి నుంచి నాకున్న గోదావ‌రి ఫ్రెండ్స్‌తో మాట్లాడ‌టం, వాళ్లు మాట్లాడేట‌ప్పుడు విన‌టం చేశాను. కాబ‌ట్టి ‘ఆయ్’ మూవీలో స్లాంగ్ మాట్లాడేట‌ప్ప‌డు నాకేమీ ఇబ్బందిగా అనిపించ‌లేదు.

* దర్శకుడు అంజి కె మణిపుత్ర అమలాపురం కుర్రాడు. ఆయ‌నకున్న ఫ్ర‌స్టేష‌న్స్‌, లైఫ్‌లో ఆయ‌న చూసినవ‌న్నీ క‌లిపి చేసిన సినిమానే ‘ఆయ్’. డైరెక్ట‌ర్ ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసి పోయే వ్య‌క్తి. సెట్స్‌లో అంద‌రితో ఫ్రెండ్లీగా ఉంటారు.

* మ్యాడ్ మూవీ క‌థ‌కు త‌గ్గ‌ట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’  సినిమా క‌థ‌కు త‌గ్గ‌ట్టు యాక్ట్ చేశాను. ఈ మూవీ కోసం స్పెష‌ల్ గా క‌ష్ట‌ప‌డ‌లేదు. డైరెక్ట‌ర్‌గారు చెప్పిన‌ట్లు ఫాలో అయ్యానంతే.

* ఎన్టీఆర్‌గారు ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న‌కు కామెడీ బాగా న‌చ్చింది. ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన త‌ర్వాత కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి అలాంటి రెస్పాన్స్ వ‌స్తే బావుంటుంద‌నిపిస్తుంది.

* అంకిత్ కొయ్య‌, క‌సిరెడ్డిగారితో ‘ఆయ్’ సినిమాకు సంబంధించిన జ‌ర్నీ చాలా బావుంది. బాగా డిస్క‌ష‌న్ చేసుకుని ఎలా చేస్తే బావుంటుంద‌నే స‌ల‌హాల‌ను తీసుకుని న‌టించాం.

* డెబ్యూ డైరెక్టర్స్‌తోనే సినిమాలు తీయాల‌ని ఏం అనుకోవ‌టం లేదు. క‌థ న‌చ్చితేనే సినిమాలు చేస్తున్నాను. మ్యాడ్ అయిన ‘ఆయ్’ మూవీ అయినా క‌థ న‌చ్చే న‌టించాను. మ్యూజిక్ గురించి చెప్పాలంటే రామ్ మిర్యాలగారు మూడు పాట‌లకు సంగీతాన్నిస్తే.. అజ‌య్ అర‌సాడ‌గారు రెండు పాట‌ల‌కు మ్యూజిక్ ఇస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మ్యూజిక్ సినిమా స‌క్సెస్‌లో చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది.

* హీరోయిన్ న‌య‌న్ సారిక మ‌రాఠీ అమ్మాయి. కానీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. త‌న పాత్ర అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది.

* కులం, మ‌తం కంటే స్నేహం చాలా గొప్ప‌ది. అంత కంటే గొప్ప విష‌య‌మేదీ ఉండ‌ద‌నే మెసేజ్‌ను ‘ఆయ్’ సినిమాలో ఇస్తున్నాం.

* మ్యాడ్ సీక్వెల్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉండొచ్చు. ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ ఓకే చేయ‌లేదు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

9 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago