‘నాయకుడు’ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇంటర్వ్యూ

Must Read

ఉదయనిధి స్టాలిన్ పొలిటికల్, యాక్షన్ డ్రామా ‘మామన్నన్’. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్  స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే తమిళనాట విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ‘నాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నాయి. రేపు (జులై 14) నాయకుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఉదయనిధి స్టాలిన్ మీడియా సమవేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మామన్నన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు ముందుగా అభినందనలు? తెలుగులో సినిమాను విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది?
థాంక్స్. మేము దీన్ని మల్టీ లాంగ్వేజస్ కోసం రూపొందించాలని ప్లాన్ చేయలేదు. తమిళంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. ఈ చిత్రం తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో పాటు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్‌ ను అందుకుంది. తెలుగు హక్కుల కోసం మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని భావించాం.

కథ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారా?
ఇది చాలా మంచి కథ . సమాజంలో సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఇందులో చర్చించాం. ఇది   పొలిటికల్ డ్రామా. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను.

తమిళంలో ఈ సినిమా సాధించిన విజయం తెలుగు వెర్షన్‌కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారా?
ఈ రోజుల్లో సోషల్ మీడియా కారణంగా, సినిమా అభిమానులందరికీ అన్ని భాషల కంటెంట్ గురించి బాగా తెలుసు. ఒక భాషలో పాజిటివ్ టాక్ వస్తే ఇతర భాషల సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కోసం తెలుగు నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న ఏషియన్ ,  సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.

ఈ సినిమా చేయడానికి మిమ్మల్నిఆకర్షించిన అంశం ఏమిటి?
కథ విన్న వెంటనే చాలా ఆసక్తి కలిగింది. నా గత చిత్రాలన్నీ కామెడీ, డ్రామా అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు. నేను జాలీ ఎల్‌ఎల్‌బికి రీమేక్‌ గా 7 సంవత్సరాల క్రితం మణితన్ అనే సినిమా చేశాను. అది పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ కామెడీ సినిమా చేయాలనుకున్నాను. కానీ ఈ కథతో మరి సెల్వరాజ్ నన్ను అబ్బురపరిచారు. నటనకు చాలా స్కోప్ ఉన్న సినిమా చేయడం నిజంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమాలో సోషల్ మెసేజ్ కూడా బాగా నచ్చింది. మారి సెల్వరాజ్ గత సినిమాలు కూడా నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం.  ఆయన చిత్రాలు  సామాజిక అన్యాయాన్ని చర్చిస్తాయి.
దీన్ని మీ చివరి సినిమాగా ఎందుకు ఎంచుకున్నారు?
కమల్‌హాసన్‌ గారి ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నేను ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో సినిమాల నుంచి తప్పుకునే ఆలోచన లేదు. కర్మన్ విడుదలయ్యాక మారి సెల్వరాజ్‌కి ఫోన్ చేసి ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పాను. తనకు చాలా కమిట్‌మెంట్లు ఉన్నాయని చెప్పారు. నేను సినిమాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నా చివరి సినిమాని బలమైన కథతో మారితో చేయాలనుకున్నాను.

వడివేలు తమిళంలో లెజెండరీ కమెడియన్. కానీ డిఫరెంట్ పాత్రలో కనిపించారు. అతనితో పని చేయడం ఎలా అనిపించింది?
నేను మిస్టర్ సూర్య ఆధవన్‌లో అతిధి పాత్రలో నటించాను. అప్పుడు వడివేలు సర్‌తో సమయం గడపడానికి, పని చేయడానికి ప్రయత్నించాను. నవ్వించే పాత్ర అది. మారి సెల్వరాజ్ మామన్నన్ కథ చెప్పినప్పుడు, సినిమాలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాను. మరుసటి రోజు తనని పిలిచి, తండ్రి పాత్రకు సరైన ఎంపిక ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అని అడిగాను. వడివేలు అని చెప్పారు. అది విని నిజంగా షాక్ అయ్యాను. పూర్తిగా డిఫరెంట్ జానర్‌లో ఈ పాత్రని ఆయన చేస్తారా అనే ఓ చిన్న సందేహం కూడా వచ్చింది. వడివేలు సర్‌కి ఫోన్ చేసి నా చివరి సినిమా చేయమని రిక్వెస్ట్ చేశాను. ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ వంటి నటీనటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.

ఆల్ ది వెరీ బెస్ట్
థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News