‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి…

Must Read

నా పాటలే విశాల్ మిశ్రాని సంగీత ప్రపంచంలో కెరీర్‌ కొనసాగించేలా ప్రేరేపించాయని తెలియడం ఆనందంగా ఉంది – ‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి

యష్ రాజ్ ఫిల్మ్స్, మోహిత్ సూరి కాంబోలో రూపొందుతున్న ‘సయారా’ బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్‌గా మారుతోంది. చార్ట్‌బస్టర్ సయారా టైటిల్ ట్రాక్ తర్వాత జుబిన్ నౌటియాల్ పాడిన ‘బర్బాద్’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు మూడవ పాటను రిలీజ్ చేశారు. ఇండియన్ సెన్సేషనల్ సింగర్ విశాల్ మిశ్రా ఈ థర్డ్ సింగిల్ ‘తుమ్ హో తో’ని ఆలపించారు. ఈ పెప్పీ లవ్ ట్రాక్‌ను మేకర్స్ మంగళవారం (జూన్ 17) నాడు విడుదల చేశారు!

Tum Ho Toh Song | Saiyaara | Ahaan Panday, Aneet Padda | Vishal Mishra, Hansika Pareek | Raj Shekhar



ఈ మూడో పాట రిలీజ్ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘12 సంవత్సరాల క్రితం విశాల్ నన్ను కలవడానికి వచ్చినప్పటి నుండి నేను, తను కలిసి ఓ ప్రత్యేకమైన సినిమా కోసం పనిచేయాలని అనుకున్నాము. మేము సరైన క్షణం కోసం వేచి చూస్తున్నాం. చివరకు అది సయారాతో నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పాటలే అతన్ని సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చాయని, అవే స్పూర్తి నింపాయని విశాల్ చెప్పడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

మన పని ఎవరిపైన అయినా ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకున్నప్పుడు అదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది. సంగీతానికి ప్రజల హృదయాలను తాకే సామర్థ్యం ఉందని, అది చాలా స్వచ్ఛమైన మాధ్యమమని నేను ఎప్పుడూ భావించాను. కాబట్టి నా 20 సంవత్సరాల దర్శకత్వం, సంగీత సృష్టిలో నా పాటల ద్వారా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను సృష్టించినందుకు నాకు నేనే కృతజ్ఞుడిగా భావిస్తుంటాను. నా కెరీర్‌లో నేను కలిసిన అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో విశాల్ మిశ్రా ఒకరు. సయారా మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆయన పాట పాడటం నా అదృష్టం. 12 సంవత్సరాలుగా నన్ను కలుస్తూనే ఉన్నప్పటి నుండి విశాల్ నాకు ఇచ్చిన గీతాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ అద్భుతాలే.

విశాల్ గురించి, అతని టాలెంట్ గురించి, అతని ఎదుగుదల గురించి తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. తుమ్ హో తో పాటతో మరోసారి అద్భుతాన్ని క్రియేట్ చేశారు. సయారా సినిమా నుండి మూడవ పాటతో అతని ప్రతిభను బయటపెట్టడానికి మేం ఎంతో ఎదురుచూశాం. అతని సంగీతాన్ని ఇష్టపడే వారు, అతని అత్యుత్తమ రొమాంటిక్ పాటను విని ఎంతో థ్రిల్ అవుతారు. విశాల్ సంగీతాన్ని ఇష్టపడే వారు తుమ్ హో తో పాటతో ప్రేమలో పడతారు’ అని అన్నారు.

‘సయారా’ టీజర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాలాతీత ప్రేమకథలను సృష్టించడంలో పేరుగాంచిన YRF, మోహిత్‌లు ఈ సారి మరోసారి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని ఆడియెన్స్‌కు అందించబోతోన్నారు. సయ్యారా టైటిల్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. దీని అర్థం సంచరించే నక్షత్రం. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎవ్వరికీ అందదు. కేవలం వర్ణించడానికి ఉపయోగిస్తారు.

ఈ చిత్రం ద్వారా అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేస్తున్నారు. అనీత్ పద్దా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. సయారాను అక్షయ్ విధాని నిర్మించారు. జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

YRF గత 50 సంవత్సరాల సినీ చరిత్రలో భారతదేశానికి అన్ని కాలాలలోనూ కల్ట్ రొమాంటిక్ చిత్రాలను అందించింది. ప్రధానంగా యష్ చోప్రా, ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఎన్నో గొప్ప ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. మోహిత్ సూరి గతంలో ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి గొప్ప లవ్, రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News