సెప్టెంబర్ 2న థియేటర్స్లో వస్తోన్న సినిమా అంత కంటే బాగుంటుంది : మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. ఈ సినిమాను సెప్టెంబర్ 2న గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. మంగళవారం సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో…
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ పెయిర్ చక్కగా ఉంది. వైష్ణవ్ తేజ్ సినిమాలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ను చూస్తున్నపుడు ఎంత ‘రంగ రంగ వైభవంగా’ ఉండిందో రేపు సెప్టెంబర్ 2న థియేటర్స్లో చూస్తున్నప్పుడు కూడా అంతే రంగ రంగ వైభవంగా ఉంటుంది. సినిమాలో వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. శ్యామ్ దత్గారు సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్గారి వల్లే ఓ మంచి టీమ్ కలిసి మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. కేతికా శర్మ మంచి కోస్టోర్ .. తనతో కలిసి పని చేయటం లవ్ లీ ఎక్స్పీరియెన్స్. సెప్టెంబర్ 2న థియేటర్స్కు వచ్చి మా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను ఎంజాయ్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ చూస్తున్న వారిలో ఓ ఎనర్జీని నేను గమనించాను. రేపు సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే ఎనర్జీ ఉంటుంది. చాలా మంది ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ను ఎందుకు పెట్టారని అడిగారు. ఇగోస్ లేని ఏ రిలేషన్షిప్ అయినా ‘రంగ రంగ వైభవంగా’గా ఉంటుందనే చెప్పటమే మా సినిమా కాన్సెప్ట్. కాబట్టే ఆ టైటిల్ను పెట్టాం. అమ్మాయి- అబ్బాయి, ఇద్దరు స్నేహితులు, రెండు కుటుంబాల మధ్యన ఆ రిలేషన్షిప్ ఉండొచ్చు. సెప్టెంబర్ 2న థియేటర్స్లోకి వస్తున్నాం. టైటిల్కు తగ్గ సక్సెస్ను ప్రేక్షకులు అందిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. పవర్ ప్యాక్డ్ మూవీని చేశాం. ఈ సినిమాలో నాకు రాధ అనే పాత్రను ఇచ్చిన డైరెక్టర్ గిరీశాయగారికి థాంక్స్. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్గా కుదిరింది. నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు గారికి థాంక్స్. వైష్ణవ్ తేజ్ డైనమిక్ హీరో. చాలా మంచి స్నేహితుడిలా సెట్స్లో ఉంటూ నన్ను ఆటపట్టించాడు..అలాగే సపోర్ట్ చేశాడు. సెప్టెంబర్ 2న ‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ‘రంగ రంగ వైభవంగా’ సినిమా మంచి ఆప్షన్ అవుతుంది. నేను, వైష్ణవ్ తేజ్తో ఉప్పెన మూవీకి వర్క్ చేశాం. ఇది మా కాంబినేషన్లో వస్తోన్న రెండో సినిమా. అలాగే బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్గారి ప్రొడక్షన్లో ‘సాహసం’ మూవీ తర్వాత నేను చేసిన రెండో సినిమా. మూడు వారిద్దరితో మూడోసారి కలిసి వర్క్ చేశాను. ఇది ఫన్, లవ్, ఎంటర్టైనింగ్ మూవీ. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు.
నటుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘‘అందరి ప్రేక్షకులను మెప్పించే ‘రంగ రంగ వైభవంగా’ వంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. ప్రసాద్గారి నిర్మాణంలో ఇలాంటి సినిమాలు ఇది వరకు రూపొందాయి. ఘన విజయాలను సాధించాయి. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ మీ ముందుకు సెప్టెంబర్ 2న రాబోతుంది. కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇది. గిరీశాయగారు డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరరూ మెచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…