జ‌వాన్ మ‌ల్టీఫేసెటెడ్ పోస్ట‌ర్ రిలీజ్‌

Must Read

ప్ర‌తి పార్వ్శానికి ఓ ఉద్దేశం ఉంది – జ‌వాన్ మ‌ల్టీఫేసెటెడ్ పోస్ట‌ర్ రిలీజ్‌

ప్ర‌తి ముఖానికీ ఓ ల‌క్ష్యం ఉంది – జ‌వాన్ మ‌ల్టీఫేసెటెడ్ పోస్ట‌ర్ రిలీజ్‌

ప్ర‌తి లుక్‌కీ ఓ ప్రాముఖ్య‌త ఉంది – జ‌వాన్ మ‌ల్టీఫేసెటెడ్ పోస్ట‌ర్ రిలీజ్‌

Or
న్యాయానికున్న ప‌లు కోణాల‌ను ఆవిష్క‌రించిన ఎస్ ఆర్ కె – జ‌వాన్ మ‌ల్టీఫేసెటెడ్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మీ కేలండ‌ర్ల‌లో సెప్టెంబ‌ర్ 7ని మార్క్ చేసుకోండి. ఎస్ ఆర్ కె లోని ప‌లు పార్వ్శాల‌ను తెర‌మీద ఆవిష్క‌రించబోయేది ఆ రోజే!
షారుఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా జ‌వాన్‌. న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రివ్యూ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ రోజు నుంచే షారుఖ్‌ఖాన్ తెర మీద ఎన్ని కోణాల్లో క‌నిపిస్తారోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్యాపించింది.


ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పింది ప్రివ్యూ. యాక్ష‌న్ గురించి జ‌నాలు ఎంత‌గా మాట్లాడుకుంటున్నారో, జ‌వాన్ సినిమాలో షారుఖ్‌ఖాన్ ఎన్ని గెట‌ప్పుల్లో క‌నిపిస్తారోన‌నే విష‌యం గురించి కూడా అంతే క్యూరియాసిటీతో మాట్లాడుకుంటున్నారు. అత‌ని గెట‌ప్పుల వెనుక ఉన్న క‌థ‌ల గురించి ఆస‌క్తిక‌రంగా ఆరా తీస్తున్నారు.
సినిమాలోని ఆయ‌న గెట‌ప్పుల‌న్నిటినీ సింగిల్ ఫ్రేమ్‌లోకి తెచ్చే విధంగా కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులోని ఐదు డిఫ‌రెంట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఒక‌దానితో ఇంకోదానికి పోలిక లేకుండా, ప్ర‌తి అవ‌తార్‌లోనూ త‌నకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో మెప్పిస్తున్నారు షారుఖ్‌.


ఈ పోస్ట‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ షారుఖ్ ఖాన్ నెవ‌ర్ సీన్ బిఫోర్ అవ‌తార్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పండుగ క‌లిగాస్తార‌ని సంతోషిస్తున్నారు.
సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? థియేట‌ర్ల‌కు వెళ్దామా? అని ఎదురుచూస్తున్నారు.
జ‌వాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుంది జ‌వాన్‌.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News