కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా మిత్రుడు ఎస్ కే ఎన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించాలి. ఇండస్ట్రీకి మంచి హిట్ సినిమాలు అందించాలి. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – ఎస్ కేఎన్ గారు ఇలాగే ప్రతి పుట్టినరోజు హ్యాపీగా జరుపుకోవాలి. మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలి. ఆ చిత్రాల్లో మాలాంటి వాళ్లకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – నా మిత్రుడు ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెల 24న చెన్నై లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఎస్ కేఎన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తాం. అన్నారు.
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ – మనం మంచి మూవీస్ చేద్దాం డార్లింగ్ అని ఎస్ కేఎన్ గతంలోనే చెప్పేవారు. ఆయన చెప్పినట్లే మంచి మూవీస్ చేస్తున్నారు. ఎస్ కేఎన్ ఇంకా గ్రాండ్ బర్త్ డే ఈవెంట్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఆయన నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఘన విజయం సాధించాలి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఎస్ కేఎన్ గారు ప్రతి బర్త్ డే ను ఇలాగే గ్రాండ్ జరుపుకోవాలి. ఆయన నుంచి మరిన్ని సక్సెస్ పుల్ మూవీస్ రావాలి. ఆయన టైమింగ్ లో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఇంకా మరింత ఎనర్జీతో ఆయన కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నా. అన్నారు.
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – నేను జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించా. పీఆర్ఓగా పనిచేశా. పాత్రికేయ మిత్రుల్లో ఒకరిగా మీ స్నేహాన్ని పొందా. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఈ వేదిక మీద నిలబడ్డా. ఈ జర్నీలో ప్రతి సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులు నా తోడుగా ఉన్నారు. మీరు లేకుండా నా సక్సెస్ లేదు. బేబి కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూడేళ్ల తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే క్లాసిక్ బ్లాక్ బస్టర్ తో మీ ముందుకు రాబోతున్నాం. అన్నారు.
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…