ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

Must Read

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా “మర్రిచెట్టు కింద మనోళ్ళు” మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియ‌ర్ న‌టుడు బాబు మోహన్ న‌టీన‌టుల‌పై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్. కెమెరా స్విఛాన్ చేశారు. థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబ‌ర్ అధ్య‌క్ష‌లు దామోద‌ర ప్ర‌సాద్, నిర్మాత సీ కళ్యాణ్, టీ ఎం ఏ ఏ ప్రెసిడెంట్ ర‌ష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్స‌వంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా న‌టుడు బాబుమోహన్ మాట్లాడుతూ.. “బ్యాన‌ర్, టైటిల్, డైరెక్ట‌ర్.. ఇలా ఈ సినిమాకు అన్నీ పవర్ ఫుల్‌గానే ఉన్నాయి. బ్యానర్‌ నార‌సింహుడి ప‌వ‌ర్‌ఫుల్ రూపాన్ని చూపించ‌డం సినిమాపై పాజిటివ్ పెంచుతుంది. “మర్రిచెట్టు కింద మనోళ్ళు” చాలా మంచి టైటిల్. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. చిత్ర‌యూనిట్‌కు ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.

దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ.. “ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించే విధంగా ఒక మంచి స‌బ్జెక్టుతో చేస్తున్న చిత్ర‌మిది. “మర్రిచెట్టు కింద మనోళ్ళు” టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా జ‌నాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాను స‌పోర్టు చేసి, ఆద‌రించాల‌ని అంద‌రిని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

థ‌ర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ… “ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి నా తోటి సీనియ‌ర్ న‌టుడు బాబు మోహ‌న్ వంటి వారితో క‌లిసి పాల్గొన‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర‌యూనిట్ అంద‌రికి ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.

స‌హ నిర్మాత ఆకుల రిషేంద్ర నరసయ్య మాట్లాడుతూ.. “యువతకు సరైన దిశ నిర్దేశం చేసే సబ్జెక్ట్ ఇది. ఇప్పటికే ఈ సినిమా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. ఇందులో మా కొడుకు ప్రమోద్ దేవా ఒక హీరోగా న‌టిస్తున్నాడు. సినిమా ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన అతిథులంద‌రికి ధన్యవాదాలు.” అని అన్నారు.

స‌హ నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. “మర్రి చెట్టు తెలియని వారు ఉండరు. జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికి మ‌ర్రిచెట్టుతో జ్ఞాప‌కాలు ఉంటాయి. అలాంటి మ‌ర్రి చెట్టు కాన్సెఫ్టుతో రానున్న‌ ఈ సినిమా అంద‌రిని అల‌రించ‌డం ఖాయం. ఇండ‌స్ట్రీలో ఒక మంచి సినిమాగా నిల‌బ‌డే ద‌మ్మున్న స‌బ్జెక్టు ఇది. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాము. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన అతిథుల‌కు ధన్యవాదాలు. పాజిటివ్ వేవ్‌తో ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం ఖాయం.” అని అన్నారు.

ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “దర్శకుడు నరేష్ వర్మ మంచి కాన్సెఫ్టుతో సినిమా చేస్తున్నాడు. సినిమా భారీ హిట్ కావాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

హీరోలు ప్రమోద్ దేవా, రణధీర్ మాట్లాడుతూ.. “ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవ‌కాశం రావ‌డం ఆనందంగా ఉంది. దర్శకుడు నరేష్ వర్మకు కృత‌జ్ఞ‌త‌లు. త‌ల్లిదండ్రులు చూపిన బాట‌లో న‌డుస్తూ వారి ఆశ‌లు నిజం చేస్తాం.” అని అన్నారు.

హీరోయిన్లు కీర్తన స్వర్గం ముస్ఖాన్ రాజేందర్ మాట్లాడుతూ.. “కెరీర్‌కు మంచి హెల్ఫ్ అయ్యే సినిమా అని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు.” అని అన్నారు.

Cast & Crew

న‌టీన‌టులు:
ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన, ముస్ఖాన్ రాజేంద‌ర్, లిరిషా, ప్రభ( బేబీ ఫేమ్ ), బాబు మోహన్, అన్నపూర్ణమ్మ, కుంతి శ్రీనివాస్, నాగ మహేష్, అప్పాజీ, రఘుబాబు, సునీతా మనోహర్, అశోక్ కుమార్, ఘర్షణ శ్రీనివాస్, దువ్వాసి మోహన్, రమేష్ చిన్నా, సమ్మెట గాంధీ, పృథ్వీ త‌దిత‌రులు.

బ్యానర్ పేరు: శ్రీ నారసింహ చిత్రాలయ
నిర్మాత: శ్రీ నారసింహ చిత్రాలయ అండ్ టీమ్

కథ -స్క్రీన్ ప్లే – దర్శకత్వం:
నరేష్ వర్మ ముద్దం

సహ నిర్మాతలు:
ఆకుల రిషేంద్ర నరసయ్య,
బీసు చందర్ గౌడ్

డీవోపీ: వినోద్ కే సిన‌గం
సంగీత దర్శకుడు: అర్హమ్
ఎడిటర్: పవన్ శేఖర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బలరాం ప్రసాద్
పీఆర్వోలు: క‌డ‌లి రాంబాబు, ద‌య్యాల అశోక్.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News