మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.
రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి తాటిపర్తి మాట్లాడుతూ – మర్డర్ మిస్టరీ కథతో ఈ చిత్రాన్ని నిర్మించాం. రిషిత అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు సంధ్య అనే డిటెక్టివ్ వస్తుంది. ఆమె కూడా మిస్సింగ్ కావడంతో కార్తీక్ ఆ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో అతను ఊహించని ఎన్నో పరిణామాలను ఎదుర్కొ సంధ్యను ఎలా చేరుకున్నాడు అనేది కథాంశం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.
ఈ చిత్రానికి – సినిమాటోగ్రఫీ – సిద్ధం నరేష్, ఎడిటింగ్ – కార్తిక్ కట్స్, సంగీతం – మార్కస్ ఎం, ఆర్ట్ డైరెక్టర్ : హేమంత్ కుమార్ జి, కో ప్రొడ్యూసర్ – పార్థు రెడ్డి, ప్రొడ్యూసర్ – అశోక్ రెడ్డి తాటిపర్తి, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం – వెంకట్ నరేంద్ర.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…