డిసెంబ‌ర్ 8న ZEE5లో ప్రీమియ‌ర్ అవుతున్న ‘క‌డ‌క్ సింగ్’

Must Read

బ్లాక్ బస్టర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌ను ప‌లు ఇండియ‌న్ భాష‌ల్లో అందిస్తూ నెంబ‌ర్ వ‌న్‌గా రాణిస్తోన్న ఓటీటీ మాధ్య‌మం ZEE5. బ‌హు భాషా ఓటీటీ మాధ్య‌మంగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న జీ 5 లైబ్ర‌రీలోకి మ‌రో విల‌క్ష‌ణ‌మైన చిత్రం చేరుతుంది. అదే ‘కడక్ సింగ్’. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గోవాలో జ‌రిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‎ఎఫ్‎ఐ) ప్రారంభ వేడుకలో మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ అభిమానులు హాజ‌రైన ప్ర‌తిష్టాత్మ‌కైన ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ ట్రైల‌ర్ విడుద‌ల‌వ‌టం విశేషం, ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఐఎఫ్‎ఎఫ్‎ఐకి సంబంధించిన‌ గాలా ప్రీమియ‌ర్స్‌లో ‘కడక్ సింగ్’ ప్రీమియ‌ర్ కానుండ‌టం మ‌రో విశేషం. డిసెంబ‌ర్ 8న ఈ ప్రీమియ‌ర్‌ను జీ5 ప్ర‌ద‌ర్శించ‌నుంది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు సినీ అభిమానులు హాజ‌ర‌వుతారు.

Kadak Singh | Official Trailer | Pankaj T, Sanjana S, Parvathy T | A ZEE5 Original Film | Watch Now

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ అనిరుద్ రాయ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘కడక్ సింగ్’ చిత్రంలో పంక‌జ్ త్రిపాఠి, పార్వ‌తి తిరువోతు వంటి జాతీయ అవార్డు విజేత‌ల‌తో పాటు సంజ‌న సంఘి, బంగ్లాదేశ్ న‌టి జ‌యా ఎహ‌సాన్‌, దిలీప్ శంక‌ర్, ప‌రేష్ పాహుజా, వ‌రుణ్ బుద్ధ‌దేవ్ న‌టించారు. ఓప‌స్ క‌మ్యూనికేష‌న్స్‌, విజ్ ఫిల్మ్స్‌, కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై ఆండ్రే తిమ్మిన్స్‌, విరాఫ్ స‌ర్కారి, స‌బ్బాస్ జోసెఫ్, హెచ్ కంటెంట్ స్టూడియో మ‌హేష్ రామ‌నాథ‌న్‌, కె.వి.ఎన్ ఈ చిత్రాన్నినిర్మించారు. శ్యామ్ సుంద‌ర్‌, ఇంద్రాణి ముఖ‌ర్జీ స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఎ.కె.శ్రీవాస్త‌వ్ అలియాస్ కడ‌క్ సింగ్ ఫైనాన్సియ‌ల్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుంటారు. త‌ను రెట్రో గ్రేడ్ అమ్నీషియాతో బాధ‌ప‌డుతుంటారు. త‌ను హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన ద‌గ్గ‌ర నుంచి సినిమా మొద‌ల‌వుతుంది. ఆయ‌న గ‌తానికి సంబంధించిన కొన్ని విష‌యాలు ఆయ‌న వ‌ర్త‌మాన జీవితంపై ప్ర‌భావాన్ని చూపుతుంటాయి. సగం స‌గం గుర్తుకు వ‌చ్చిన జ్ఞాప‌కాల‌తో ఇబ్బంది ప‌డుతున్న కడ‌క్ సింగ్ ఓ రోజు త‌న‌కేమైందో తెలుసుకోవాల‌ని అనుకుంటాడు. ఇదే క్ర‌మంలో త‌న కుటుంబం విడిపోకుండా కాపాడుకుంటూ వ‌స్తుంటాడు. ఓ వైపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాల‌ను కొత్త కోణంలో చూపించే క‌థాంశంతో చూపించేలా ‘కడక్ సింగ్’ సినిమా ఉంటుంది.

ట్రెయిలర్ లింక్ – https://youtu.be/zP0AsKwd_Fo

ఈ సంద‌ర్భంగా పంక‌జ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘‘నటుడిగా ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను పోషించాను. కానీ క‌డ‌క్ సింగ్ త‌ర‌హా పాత్ర‌లో ఎప్పుడూ న‌టించ‌లేదు. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌టం యాక్ట‌ర్‌లో నాలో ఓ కొత్త‌ ఉత్సాహ‌న్నిస్తుంది. అలాగే టోని డా, పార్వ‌తి, జ‌య‌, సంజ‌న స‌హా ప‌లువురు ఔత్సాహిక న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం క‌లిగింది. గోవాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మా ‘కడక్ సింగ్’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం సంతోషంగా ఉంది. ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అదే ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమాను కూడా డిసెంబ‌ర్ 8న‌ ప్ర‌ద‌ర్శించ‌బోతుండ‌టం ఆనందంగా ఉంది’’ అన్నారు.

పార్వ‌తి తిరువోతు మాట్లాడుతూ ‘‘‘కడక్ సింగ్’లో నటించటం అరుదుగా దొరికే అవకాశం. టోని డా సృష్టించిన పాత్ర ఇది. అందులోనూ పంక‌జ్ వంటి యాక్ట‌ర్‌తో క‌లిసి న‌టించ‌టం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే సంజ‌న సంఘి, ప‌రేష్ పాహుజ‌, జ‌యా ఎహ‌సాన్ ఇలా అంద‌రూ అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. మ‌నం సినిమాల రూపంలో చూపించే క‌థ‌ల్లో విష‌య సంగ్ర‌హ‌ణ‌తో పాటు మాన‌వ‌త్వాన్ని మేల్కొపేలా ఉండాలి. అలాంటి ఓ అనుభూతిని టోనీ డా అండ్ టీమ్ ‘కడక్ సింగ్’లో మాకు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

సంజ‌న సంఘి మాట్లాడుతూ ‘‘‘కడక్ సింగ్’ కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. డైెరెక్టర్ అనిరుధ్ అండ్ టీమ్ దాన్ని ఇంకా బాగా తెర‌కెక్కించారు. ఇందులో పంక‌జ్ త్రిపాఠి నా తండ్రి పాత్ర‌ను పోషించారు. ఆయ‌న న‌ట‌న‌లో డాక్ట‌రేట్ చేశారు. గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం హ్యాపీగా ఉంది. త్వ‌ర‌లో ఇక్క‌డే ఈ చిత్రాన్ని ప్రీమియ‌ర్ చేయ‌బోతున్నాం. దానికి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు.

జ‌య మాట్లాడుతూ ‘‘‘కడక్ సింగ్’లో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాను. ఇదొక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌. చాలా మంచి టీమ్‌తో క‌లిసి ప‌ని చేశాను. పంక‌జ్ వంటి గొప్ప యాక్ట‌ర్‌తో న‌టించ‌టం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. అనిరుధ్ రాయ్‌గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఓ డిఫ‌రెంట్ లాంగ్వేజ్ మూవీలో న‌టించ‌టం, కొత్త సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టటం అనేది న‌టిగా నాకు ఓ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నేను న‌టించిన సినిమాల్లో దీనికి ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. శాంత‌ను మైత్ర సంగీతం మ‌నసుకు హ‌త్తుకుంటుంది. అవిక్ ముఖోపాధ్యాయ్ విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

‘కడక్ సింగ్’ డిసెంబ‌ర్ 8న ZEE 5 లో ప్రీమియ‌ర్ అవుతుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News