యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్: 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఈశా ఫౌండేషన్‌ – కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం, అలాగే బెంగళూరులోని సద్గురు సన్నిధిలో ఎన్‌సిసి (NCC) కేడెట్‌లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కోసం ప్రత్యేక యోగా సెషన్‌లను నిర్వహించింది.
భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1000 ఉచిత యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇందులో కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, రక్షణ సంస్థలు, ఇంకా స్థానిక సంఘాల నుండి సుమారు 50,000 మంది పాల్గొన్నారు.

జూన్ 21, 2026: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు, “మీకు తెలిసిందే, పన్నెండేళ్లు అనేది సుమారుగా ఒక సౌర చక్రం. కాబట్టి మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవపు ఒక చక్రం పూర్తి చేశాం. తమను తాము చక్కదిద్దుకునే మార్గాలు ఉన్నాయని ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు.

యోగా యొక్క నిజమైన పరమార్థాన్ని నొక్కిచెబుతూ సద్గురు, “మనం యోగా అంటున్నది ఒక తత్వశాస్త్రం కాదు, సిద్ధాంతం కాదు, నమ్మకం కాదు, మతం కాదు. చాలామంది అనుకుంటున్నట్లుగా కచ్చితంగా ఇది శరీరాన్ని మెలితిప్పడం గురించి కాదు” అని అన్నారు. బాహ్య శ్రేయస్సు కోసం సైన్స్ ఇంకా టెక్నాలజీ ఎలాగైతే ఉన్నాయో, అంతరంగ శ్రేయస్సు కోసం కూడా ఒక సంపూర్ణమైన సైన్స్ ఇంకా టెక్నాలజీ ఉన్నాయి అని గుర్తుచేసేదే యోగా అని ఆయన వివరించారు.

x.com/sadhgurujv/status/2068556530476064830

మానవాళి ఎదుర్కొంటోన్న సవాళ్లలో చాలా వాటికి కారణం, మానవ అనుభూతి యొక్క మౌలిక పునాదిని అర్థం చేసుకోకపోవడమే అని ఆయన ఉద్ఘాటించారు. “మానవ అనుభూతి అనేది మన లోపలి నుంచే జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయికి తీసుకెళ్లాలంటే, అంతర్ముఖులవ్వడమే ఏకైక మార్గం. ఇది జరిగి తీరాలి. యోగా ప్రాథమిక లక్ష్యం ఇదే.”

ఈ సందర్భంగా, ఈశా ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1,000 ఉచిత యోగా ఇంకా ధ్యాన కార్యక్రమాలను నిర్వహించింది. కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, రక్షణ సంస్థలు, వివిధ స్థానిక సంఘాల నుండి సుమారు 50,000 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, మెరుగైన జీవన ప్రమాణాలకు తోడ్పడేలా రూపొందించిన సరళమైన యోగ పద్ధతులను, ధ్యాన ప్రక్రియలను వారికి పరిచయం చేశారు.

కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 700 మందికి పైగా స్వయంగా పాల్గొన్నారు. ఇందులో యంగ్ ఇండియన్స్ కోయంబత్తూరు చాప్టర్ నుండి 500 మంది విద్యార్థులు, అలాగే 200 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది ఉన్నారు. ఇక బెంగళూరులోని సద్గురు సన్నిధిలో ఉన్న ఆదియోగి వద్ద జరిగిన యోగా ఇంకా ధ్యాన కార్యక్రమాలలో NCC కేడెట్‌లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు, వాలంటీర్లు, సాధారణ ప్రజలతో కలుపుకుని మొత్తం 2,500 మందికి పైగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సద్గురు అందిస్తున్న ఉచిత గైడెడ్ మెడిటేషన్ యాప్ ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ (Miracle of Mind)కి ఆరు కొత్త భాషలను జతచేశారు – గుజరాతీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇటాలియన్ మరియు నేపాలీ. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడేవారు ఈ 7 నిమిషాల ధ్యాన ప్రక్రియను మరింత సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్ ఇప్పుడు 12 భాషల్లో అందుబాటులో ఉంది. దీన్ని isha.sadhguru.org/in/en/miracle-of-mind ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

TFJA

Recent Posts

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

9 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

17 hours ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

2 days ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

2 days ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

2 days ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

2 days ago