అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ ..
‘‘నా ఫొటోలను చూసి ఆడిషన్కు పిలిచారు. సెలక్ట్ అయ్యాను. అయితే పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించాను. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్ను గమనించాను. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలను గమనించాను. ఈ క్రమంలో డైరెక్టర్గారు ఎయిర్ హోస్టస్ పాత్ర చేయటానికి నాకు కొన్ని రెఫరెన్స్లనిచ్చారు. అవేంతో ఉపయోగపడ్డాయి. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి ఎక్స్పీరియెన్స్. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువ. తన ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అడవుల్లో వైల్డ్ లైఫ్కు సంబంధించిన యాత్రికులతో కలిసి సఫారీల్లో వెళ్లి అక్కడి జంతువులను తన కెమెరాల్లో బంధిస్తుంటుంది ప్రిష.
‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్లకు సంబంధించిన ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదు. వాటికి సంబంధించి సహజమైన భావోద్వేగాలను బంధించటమే. అలాంటి విషయాలను నా కెమెరాలో బంధించినప్పుడు సంతృప్తిని, మంచి అనుభవాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా నటించగలుగుతున్నాను’’ అన్నారు.
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…
బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్…
▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…