‘వార్ 2’లో హృతిక్ పాత్రను ఆడియెన్స్‌కి మరింత దగ్గర చేసేలా స్టైలింగ్ చేశాము : కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

గ్రీకు గాడ్ ఆఫ్ ఇండియా అని అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. భారతదేశంలో అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరైన హృతిక్ తన యాక్షన్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌కు పెట్టింది పేరు. వరుస విజయాలను అందించే YRF స్పై యూనివర్స్‌లోని బ్లాక్‌బస్టర్ వార్ ఫ్రాంచైజీలో హృతిక్ సూపర్ గూఢచారి అయిన కబీర్ పాత్రను హృతిక్ అద్భుతంగా పోషించిన సంగతి తెలిసిందే.

‘వార్’ చిత్రంలో కబీర్ పాత్రలో హృతిక్ కనిపించిన తీరు, ఆయన స్టైలింగ్, లుక్స్, క్యాస్టూమ్స్‌కు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ‘వార్ 2’లోనూ హృతిక్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సారి మాత్రం మరింత స్టైలీష్‌గా కనిపించబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ టీజర్‌లో కబీర్ కారెక్టర్‌లో మరోసారి హృతిక్ మరింత స్టైలీష్‌గా కనిపించారు.

ఇక హృతిక్ క్యాస్టూమ్స్, స్టైలింగ్ గురించి వచ్చిన ప్రశంసలతో కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఉబ్బితబ్బిబైపోయారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం హృతిక్ పాత్రను, ఆయన స్టైలింగ్‌ను మరింత స్పెషల్‌గా డిజైన్ చేశాం. ధూమ్ 2, బ్యాంగ్ బ్యాంగ్, వాణిజ్య ప్రకటనల్లో హృతిక్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. చాలా కాలం తరువాత మళ్లీ ‘వార్’ సినిమాకు పని చేసే ఛాన్స్ వచ్చింది. ప్రతీ సారి మేం ఇద్దరం ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసేవాళ్లం. కానీ ‘వార్’తో మేం పూర్తిగా రూట్ చేంజ్ చేశాం. మమూలు దుస్తులు వేసినా కూడా దాంట్లో ఓ ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. పైగా కబీర్ పాత్రలోని ఒంటరితనం, ఆ పాత్రలోని దేశ భక్తి ఇలా అన్నీ వ్యక్తం అవ్వాలనే ఉద్దేశంతో క్యాస్టూమ్స్, స్టైలింగ్‌ను డిజైన్ చేశాను. సాదారణ దుస్తుల్లోనూ ఓ సూపర్ హీరోలా కనిపించాలని నేను అనుకున్నాను.

ఈ సారి వార్ కంటే భిన్నంగా, మరింత అద్భుతంగా ఉండాలని కబీర్ పాత్ర కోసం శ్రమించాము. హెయిర్‌కట్ దగ్గర్నుంచి ప్రతీ విషయంపై ఎంతో శ్రద్ద పెట్టాము. హృతిక్‌లో ఉండే ఆ అట్రాక్టివ్ పవర్‌ను మరింతగా మెరుగుపర్చేలా స్టైలింగ్ చేశాను’ అని అన్నారు.

ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ ‘వార్ 2’లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌ ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌ మధ్య ఢీ అంటే ఢీ అనే పోటీ ఉండనుంది. కియారా అద్వానీ మరో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago