‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

Must Read

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు. ఈ మూవీలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇప్పటి వరకు మా ‘హే బల్‌వంత్’ మూవీ గురించి చాలా సార్లు చాలా వేదికలపై చెప్పాం. 650 పైగా స్క్రీన్లలో మా సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. ఇది మా కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. రేపు రిలీజ్ అవుతుండగా.. గురువారం సాయంత్రం నుంచే చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్లను స్టార్ట్ చేశాం. అన్ని ఏరియాల్లో ఈ పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేశాం. వన్ మంత్ డైట్ చేయాల్సిన అవసరం లేకుండా.. వన్ మంత్ జిమ్, రన్నింగ్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఒక్క మూడు గంటలు మాకిస్తే.. వన్ మంత‌కి సరిపడే ఆరోగ్యాన్ని మేం మీకు ఇస్తాం.. మా దగ్గర మంచి స్టోరీ, మంచి ఎమోషన్ ఉంది. మా దగ్గర మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. అందరూ వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లండి. మేం కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నామ’ని అన్నారు.

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ .. ‘‘హే భగవాన్’ మరింత బలవంతంగా మారి ‘హే బల్‌వంత్’గా రాబోతోంది. ఓవర్సీస్‌లో మూడు వందల థియేటర్లకు పైగా రిలీజ్ అవుతోంది. అక్కడ అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. అక్కడా, ఇక్కడా మంచి జోష్‌లో దూసుకుపోతోంది. అనిల్ సుంకర గారు ఓవర్సీస్‌లో వైబ్ చూసి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని అన్నారు. మరో డైరెక్టర్ ఫోన్ చేసి రెండున్నర గంటలసేపు నవ్వించేశారు అని చెప్పారు. మీడియా కూడా ముందే మాకు కంగ్రాట్స్ చెబుతోంది. ఈ ఏడాది అంతా టాలీవుడ్‌కు కలిసి వచ్చేలా ఉంది. కొత్తదనంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రాబోతోంది. సుహాస్ నెక్ట్స్ ఫేజ్‌లోకి వెళ్తున్నాడు.క్లైమాక్స్‌లో సుహాస్ అందరినీ ఆకట్టుకుంటాడు. తెలుగు సినిమాల్లో ‘హే బల్‌వంత్’ మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది. ఈ మూవలో అందరూ అద్భుతంగా నటించారు. గోపీ రూపంలో తెలుగు ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు. వంశీ నందిపాటి ఉంటే చాలు ఆ సినిమా హిట్టే. ఫిబ్రవరి 19 సాయంత్రం నుంచే ప్రీమియర్లు స్టార్ట్ కాబోతోన్నాయి. మేం అందరూ ప్రస్తుతం ఎంతో విజయోత్సాహాంలో ఉన్నామ’ని అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ .. ‘‘హే బల్‌వంత్’ ప్రీమియర్లు ఫిబ్రవరి 19న స్టార్ట్ అయ్యాయి. ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ రిలీజ్, బిగ్గెస్ట్ సక్సెస్ అని అనుకోవచ్చు. మా మూవీని ఈ రేంజ్‌కు తీసుకు వచ్చిన వంశీ గారికి థాంక్స్. నేను ఓ కామన్ మెన్‌గా ఇక్కడి వరకు వచ్చాను. మనం పెట్టే ప్రతీ రూపాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ మూవీని చేశాను. నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. సుహాస్ గ్యారెంటీ.. ‘హే బల్‌వంత్’ అనేది సుహాస్ 2.ఓ. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News