గొప్ప సందేశంతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం ‘ఓటు’. తప్పకుండా ప్రేక్షకులని అలరిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్
హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నచిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.
‘మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో పొలిటికల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ కూడా అలరించాయి. ‘’మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా ? ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి.
హృతిక్ శౌర్య టీజర్ లో ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. అనుభవం వున్న నటుడిలా తన పాత్రలో ఒదిగిపోయారు. హృతిక్ శౌర్య, తన్వి నేగి కెమిస్ట్రీ కూడా బ్యూటీఫుల్ గా వుంది. గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ఆకట్టుకున్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆర్పీ పట్నాయిక్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తర్వాత అంత పెద్ద హైట్ వున్న హీరో ఇంకెవరూ రారేమో అనుకున్నప్పుడు హృతిక్ శౌర్య వచ్చారు( నవ్వుతూ). తన ఎత్తుకు తగ్గట్టు హైట్స్ కి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో టైటిల్ లోనే తెలుస్తుంది. ఓటుకు డబ్బులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి వున్న సమాజానికి వెన్నుతట్టి లేపాల్సిన అవసరం వుంది. అందుకు ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాని నిర్మించిన చిత్ర బృందానికి అభినందనలు. పాటలు చక్కగా వున్నాయి. సిరిమల్లె పువ్వు పాట తో శ్రీదేవి గారికి ఎంతపేరు వచ్చిందో ఈ సినిమాలో అలాంటి పాటలో నటించిన తన్వి కూడా అలాంటి పేరురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని, సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.
హృతిక్ శౌర్య మాట్లాడుతూ.. టీజర్ ని లాంచ్ చేసిన ఆర్పీ పట్నాయిక్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు రవి గారు నాపై ఎంతో నమ్మకం పెట్టారు. ఆయనకి కృతజ్ఞతలు.చాలా ముఖ్యమైన కథ ఇది. గోపరాజు రమణగారు ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. తన్వి చాలా బ్యూటీఫుల్ గా నటించారు. టీం అందరికీ థాంక్స్.’ తెలిపారు
తన్వి మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. హృతిక్ శౌర్య వండర్ ఫుల్ కోస్టార్. చాలా ముఖ్యమైన కథ ఇది. సినిమా చక్కగా వచ్చింది. ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
గోపరాజు రమణ మాట్లాడుతూ.. ఓటు ప్రాముఖ్యత జోడిస్తూ కుటుంబకథా చిత్రంగా ఈ సినిమాని మలిచి దర్శక నిర్మాతలకు అభినందనలు. ఇందులో నేను కీలక పాత్రలో నటించాను. హృతిక్ శౌర్యమ హీరోయిన్ తన్వి కొత్తవారైనప్పటి చాలా అనుభవం వున్న నటుల్లా బాగా నటించారు. సినిమా చాలా బావొచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
తారాగణం: హృతిక్ శౌర్య, తన్వినేగి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : రవి
బ్యానర్ : ఫ్లిక్ నైన్ స్టూడియోస్
నిర్మాణం: ఫ్లిక్ ఫిలిమ్స్
సంగీతం: అగస్త్య
డీవోపీ : ఎస్ రాజశేఖర్
ఎడిటర్ : ప్రసాద్
ఆర్ట్ : మోహన్ తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: రామకృష్ణ
పీఆర్వో : వంశీ శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…